Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితుడుని చూసేందుకు వచ్చి అతని చేతిలోనే అత్యాచారానికిగురైన బ్రిటన్ మహిళ!

ఠాగూర్
గురువారం, 13 మార్చి 2025 (17:23 IST)
సోషల్ మీడియా వేదికగా పరిచయమైన తన స్నేహితుడుని చూసేందుకు బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన ఓ మహిళ చివరకు అతని చేతిలోనే అత్యాచారానికిగురైంది. ఈ దారుణం దేశ రాజధాని ఢిల్లీలోని మహిపాల్ పూర్ ప్రాంతంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఢిల్లీలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే కైలాశ్ అనే యువకుడుకి బ్రిటన్‌కు చెందిన ఓ మహిళతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. దీంతో అతన్ని చూసేందుకు ఇటీవల భారత్‌కు వచ్చింది. మహిపాల్ పూర్‌లోని ఒక హోటల్‌లో గదిని బుక్ చేసుకుంది. ఆమెను కలిసేందుకు వచ్చిన కైలాశ్.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. మరో స్నేహితుడుతో కలిసి ఆమెపై లైంగికదాడికి తెగబడ్డాడు. వారి నుంచి తప్పించుకున్న ఆ మహిళ... పోలీసులను ఆశ్రయించింది. తొలుత కైలాశ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, అక్కడి నుంచి తప్పించుకుని రిసెప్షన్ వద్దకు చేరుకునేందుకు లిఫ్ట్ ఎక్కిన తనను అతని స్నేహితుడు లైంగికంగా వేధించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 
 
కాగా, భారత్‌కు వచ్చిన బ్రిటన్ మహిళ తొలుత గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో పర్యటించింది. తన స్నేహితుడు కైలాశ్‌ను కూడా తనతో రమ్మని పిలిచింది. అయితే, తాను అక్కడకు రాలేనని చెప్పడంతో ఆ మహిళే ఢిల్లీకి రాగా, ఈ దారుణం జరిగింది. ఈ ఘటనను భారత్‌లోని బ్రిటన్ హైకమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, ఇటీవల కర్నాటక రాష్ట్రంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం