Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

15 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. రైలు పరిచయం.. హోటల్ గది..

gang rape

సెల్వి

, శనివారం, 19 అక్టోబరు 2024 (13:41 IST)
దేశ రాజధాని నగరం ఢిల్లీలో 15 ఏళ్ల బాలికపై సామూహిక లైంగికదాడి జరిగింది. ఓ హోటల్ గదిలో ఐదుగురు వ్యక్తులు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీకి చెందిన బాలిక పదో తరగతి చదువుతోంది. 
 
ఈ నెల 4న ఆమె ఒంటరిగా రైలెక్కి ఢిల్లీ చేరుకుంది. రైలులో ఆమెకు పరిచయమైన నిందితులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ముగ్గురు మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు చెందినవారు. 
 
5, 6 తేదీల్లో ఢిల్లీ విమానాశ్రయంలో సమీపంలోని హోటల్‌లో ఆమెపై లైంగికదాడి జరిగిందని పోలీసులు తెలిపారు. తన కుమార్తె కనిపించడం లేదని బాధిత బాలిక తండ్రి హల్ద్వానీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
సీసీటీవీ ఫుటేజీలు, బాధితురాలి ఫోన్ లోకేషన్ ఆధారంగా బాలిక ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఉన్నట్టు గుర్తించారు. బాధితురాలి వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు ఆమెను తిరిగి ఈ వారం హల్ద్వానీ చేర్చారు. వైద్య పరీక్షల్లో ఆమెపై లైంగిక దాడి జరిగినట్టు తేలింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి: పసిడి ధరలు పైపైకి.. వెండి ధరలు కూడా అప్