Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా సెకండ్ వేవ్ పంజా.. ఎమెర్జీని తలపిస్తోంది.. సుప్రీం సీరియస్

Webdunia
గురువారం, 22 ఏప్రియల్ 2021 (13:54 IST)
భారత్‌పై కోవిడ్ సెకండ్ వేవ్ పంజా విసురుతోంది. అమెరికా, బ్రెజిల్ కంటే తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిత్యం మూడు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేలాది మంది మృత్యువాత పడుతున్నారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా కట్టడి అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటా స్వీకరించింది. దేశంలో పరిస్థితి అల్లకల్లోలంగా తయారయిందని.. ఎమర్జెన్సీ పరిస్థితులను ఎదుర్కొంటోందని సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
కోవిడ్ మహమ్మారి నియంత్రణకు జాతీయ ప్రణాళిక అవసరమని సీజేఐ జస్టిన్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మానసనం అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రానికి నోటీసులు జారీచేసింది. దేశంలో ఆక్సిజన్‌ సరఫరా, రెమిడిసివిర్ వంటి అత్యవసర మందుల సరఫరా, వ్యాక్సినేషన్‌ పద్ధతి, లాక్‌డౌన్‌ ప్రకటించే అధికారం.. ఈ నాలుగు అంశాలను సమగ్రంగా తెలుసుకోవాలనుకుంటున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. 
 
అందుకే కరోనా అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తున్నట్లు అని చీఫ్‌ జస్టిస్‌ బోబ్డే స్పష్టం చేశారు. కరోనా నియంత్రణకు రేపటిలోగా సంసిద్ధ జాతీయ స్థాయి ప్రణాళికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంలో కోర్టుకు సలహాలు అందించేందుకు ప్రముఖ న్యాయవాది జస్టిస్‌ హరీష్‌ సాల్వేను అమికస్‌ క్యూరీగా సుప్రీంకోర్టు నియమించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments