Webdunia - Bharat's app for daily news and videos

Install App

నరేంద్ర మోదీ అన్నంత పనీ చేస్తున్నారా? అద్వానీ కళ్లలో ఆనంద బాష్పాలు...

నరేంద్ర మోదీ అంటే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ పొలిటికల్ స్టార్. ప్రజల నాడి పట్టడంలో ఆయనను మించినవారు లేరని అంతర్జాతీయ మీడియా ఇప్పుడు ఆయనపై కథనాలు రాస్తోంది. మరో దశాబ్ద కాలం పాటూ ఆయనకు తిరుగు లేదని పతాక శీర్షికల్లో తెలుపుతోంది. భాజపాకు అంతటి ప్రాభవా

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (15:56 IST)
నరేంద్ర మోదీ అంటే ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ పొలిటికల్ స్టార్. ప్రజల నాడి పట్టడంలో ఆయనను మించినవారు లేరని అంతర్జాతీయ మీడియా ఇప్పుడు ఆయనపై కథనాలు రాస్తోంది. మరో దశాబ్ద కాలం పాటూ ఆయనకు తిరుగు లేదని పతాక శీర్షికల్లో తెలుపుతోంది. భాజపాకు అంతటి ప్రాభవాన్ని తెచ్చిన నరేంద్ర మోదీ అంటే లాల్ కృష్ణ అద్వానీకి మాత్రం ప్రత్యేక అభిమానం వుండదూ. అందుకే ప్రధాని మోదీని అభినందనలతో ముంచెత్తారట. భాజపాకు ఇంతటి ఘన విజయం సాధించినందుకు ఆయన కళ్లలో ఆనంద బాష్పాలు కురిశాయట. 
 
ఇదిలావుండగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం ముగియగానే ఆ పదవిలో ఎవర్ని ఎంపిక చేస్తారన్న చర్చ ఎప్పటి నుండో జరుగుతూ వస్తోంది. అద్వానీకి ఆ పదవి కట్టబెడతారంటూ వార్తలు కూడా వచ్చాయి. అదే నిజం చేయబోతున్నారట ప్రధాని నరేంద్ర మోదీ. తన సన్నిహితుల వద్ద అద్వానీజీని రాష్ట్రపతిగా ఎన్నుకోబోతున్నట్లు చర్చ జరిపినట్లు సమాచారం. గుజరాత్ రాష్ట్రంలో జరిగిన సమావేశంలో నరేంద్ర మోదీ రాష్ట్రపతిగా అద్వానీ పేరును సూచించినట్లు చెపుతున్నారు. మొత్తమ్మీద గురుదక్షిణగా అద్వానీకి నరేంద్ర మోదీ రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వనున్నారన్నమాట.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments