Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్మూ-కాశ్మీర్‌లో మరోసారి ఉగ్ర కలకలం: నలుగురు మృతి

Webdunia
శనివారం, 12 జూన్ 2021 (15:51 IST)
జమ్మూ-కాశ్మీర్‌లో మరోసారి ఉగ్ర కలకలం రేగింది. సోపోర్‌లో సీఆర్పీఎఫ్, కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందంపై ఉగ్రవాదులు గ్రనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఓ పోలీసు సహా ముగ్గురు గాయపడ్డారు. 
 
క్షతగాత్రులను సైనిక ఆసుపత్రికి తరలించారు. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. మొదట గ్రనేడ్లు విసిరి, ఆపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కోసం భద్రతాదళాలు గాలింపు ప్రారంభించాయి.
 
కాగా గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్, కాల్పుల మోతతో ఉలిక్కిపడింది. మరోవైపు భద్రతా దళాలను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు ఐఈడీ బాంబులు పెడుతున్నారు. తాజాగా రెండు ఐఈడీ బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి. ఇక ఓ తోటలో ఉంచిన 5 కేజీల పేలుడు పదార్దాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థం కేసుపై జమ్మూ కాశ్మీర్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments