Webdunia - Bharat's app for daily news and videos

Install App

గారెల కోసం గొడవ.. రుచిగా లేవని హోటల్ యజమాని గొంతుకోసేశాడు..

గారెల కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. క్షణికావేశంతో జరిగే హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. భావోద్వేగాలకు లోనై.. దారుణాలకు పాల్పడే ఘటనలు దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా గారెలు రుచిగా లేవనే చిన్

Webdunia
గురువారం, 18 మే 2017 (17:22 IST)
గారెల కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. క్షణికావేశంతో జరిగే హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. భావోద్వేగాలకు లోనై.. దారుణాలకు పాల్పడే ఘటనలు దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా గారెలు రుచిగా లేవనే చిన్న కారణంతో హోటల్ యజమానిని ఓ యువకుడు గొంతుకోసి చంపేసిన ఘటన కేరళలోని మంగళప్పిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల రతీష్ అనే ట్యాక్సీ డ్రైవర్.. జాన్సన్ నడుపుతున్న హోటల్‌కు వెళ్లాడు. ఆ హోటల్‌లో గారెలు ఆర్డర్ చేశాడు. ఫుల్‌గా లాగించేశాడు. ఆపై వడలు రుచిగా లేవని జాన్సన్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. దీంతో కస్టమర్లకు ఇబ్బందిగా ఉందని.. ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందిగా జాన్సన్ రతీష్‌ను హోటల్‌ నుంచి గెంటేశాడు. 
 
బయటకు వెళ్లిన రతీష్.. ఫూటుగా తాగి.. బైకుపై వెళ్తున్న జాన్సన్‌ను అడ్డుకుని గొంతుకోసి పారిపోయాడు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాన్సన్ మరణించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రతీష్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments