Webdunia - Bharat's app for daily news and videos

Install App

గారెల కోసం గొడవ.. రుచిగా లేవని హోటల్ యజమాని గొంతుకోసేశాడు..

గారెల కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. క్షణికావేశంతో జరిగే హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. భావోద్వేగాలకు లోనై.. దారుణాలకు పాల్పడే ఘటనలు దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా గారెలు రుచిగా లేవనే చిన్

Webdunia
గురువారం, 18 మే 2017 (17:22 IST)
గారెల కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. క్షణికావేశంతో జరిగే హత్యలు పెచ్చరిల్లిపోతున్నాయి. భావోద్వేగాలకు లోనై.. దారుణాలకు పాల్పడే ఘటనలు దేశంలో ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా గారెలు రుచిగా లేవనే చిన్న కారణంతో హోటల్ యజమానిని ఓ యువకుడు గొంతుకోసి చంపేసిన ఘటన కేరళలోని మంగళప్పిల్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన 27 ఏళ్ల రతీష్ అనే ట్యాక్సీ డ్రైవర్.. జాన్సన్ నడుపుతున్న హోటల్‌కు వెళ్లాడు. ఆ హోటల్‌లో గారెలు ఆర్డర్ చేశాడు. ఫుల్‌గా లాగించేశాడు. ఆపై వడలు రుచిగా లేవని జాన్సన్‌తో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది. దీంతో కస్టమర్లకు ఇబ్బందిగా ఉందని.. ఇక్కడ నుంచి వెళ్లిపోవాల్సిందిగా జాన్సన్ రతీష్‌ను హోటల్‌ నుంచి గెంటేశాడు. 
 
బయటకు వెళ్లిన రతీష్.. ఫూటుగా తాగి.. బైకుపై వెళ్తున్న జాన్సన్‌ను అడ్డుకుని గొంతుకోసి పారిపోయాడు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాన్సన్ మరణించాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న రతీష్‌ను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments