Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.. ప్రేయసి ఏం చేసిందో తెలుసా?

ప్రేమించిన వ్యక్తి వేరొక వివాహం చేసుకున్నాడు. అంతే ఆ ప్రేయసి తట్టుకోలేకపోయింది. ఇక జీవించకూడదనుకుంది. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కె.నాగులపురం గ్

Webdunia
శనివారం, 3 జూన్ 2017 (12:42 IST)
ప్రేమించిన వ్యక్తి వేరొక వివాహం చేసుకున్నాడు. అంతే ఆ ప్రేయసి తట్టుకోలేకపోయింది. ఇక జీవించకూడదనుకుంది. ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. కె.నాగులపురం గ్రామానికి చెందిన గీత(17) కోడుమూరులో టీటీసీ చదువుతోంది. పెంచికలపాడుకు చెందిన సోమశేఖర్ రెడ్డి కర్నూలులో డిగ్రీ చేస్తుండగా, వీరిద్దరూ ప్రేమించుకున్నారు. 
 
కులాలు వేరు కావడంతో పెద్దలు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో మూడు నెలల క్రితం ఇంట్లోంచి పారిపోయి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆపై పెద్ద మనుషుల పిలుపు మేరకు ఇటీవలే గ్రామానికి వచ్చారు. పంచాయితీ పెద్దల సమక్షంలో గీత తల్లిదండ్రులకు సోమశేఖర్ తల్లిదండ్రులు కొంత డబ్బు ముట్టజెప్పి చేతులు దులుపుకున్నారు.
 
ఆపై సోమశేఖర్‌కు వేరొక మహిళతో వివాహం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గీత మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

హారర్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న నిశ్శబ్ద సినిమా టీజర్ విడుదల

Dhanush: ఆయన వల్లే డంప్‌యార్డ్‌లో ఏడు గంటలపాటు నేను, రష్మిక వున్నాం: ధనుష్

Srileela: ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నాయిక శ్రీలీల

నాకు పొగరు నిజమే.. దానికి కారణం కూడా నేనే : బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments