Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొదటి తండ్రి స్థానంలో రెండో తండ్రిని చూడలేక చంపేసాడు

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (22:26 IST)
పదవ తరగతి చదువుతున్న పదిహేనేళ్ల బాలుడు సవతి తండ్రిని దారుణంగా చంపిన ఘటన యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఇనుప రాడ్‌లతో కొట్టి కిరాతకంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే బాలుడి తండ్రి ఇటీవల గుండెపోటుతో మరణించాడు. అది జరిగి నెల రోజులు కూడా కాకముందే తల్లి రెండో వివాహం చేసుకోవడం అతడికి నచ్చలేదు.
 
సవతి తండ్రిని మనస్పూర్తిగా అంగీకరించలేకపోయాడు. తల్లి ఎన్నిసార్లు చెప్పిచూసినా కొడుకు మాటవినలేదు. పైగా ద్వేషం పెంచుకుని మనసులో రగిలిపోయాడు. ఎలాగైనా సవతి తండ్రిని హతమార్చాలని పన్నాగం పన్నాడు. స్నేహితులతో కలిసి మాటువేసాడు, తన సోదరునితో కలిసి బైక్‌పై వస్తున్న అతడిని అడ్డుకుని, అందరూ కలిసి దాడి చేసారు.
 
ఇనుప రాడ్లతో రక్తం చిందేలా కొట్టారు. తుపాకీతో కాల్చడంతో బుల్లెట్లు దిగి అక్కడికక్కడే మరణించాడు. మృతుని సోదరుడు అక్కడ నుండి పారిపోయాడు. కొడుకు ఇంటికి వచ్చి తల్లితో విషయం చెప్పి పరారయ్యాడు. పోలీసులకు సమాచారం అందటంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు, బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments