మొదటి తండ్రి స్థానంలో రెండో తండ్రిని చూడలేక చంపేసాడు

Webdunia
శుక్రవారం, 5 జూన్ 2020 (22:26 IST)
పదవ తరగతి చదువుతున్న పదిహేనేళ్ల బాలుడు సవతి తండ్రిని దారుణంగా చంపిన ఘటన యూపీలోని సుల్తాన్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. స్నేహితులతో కలిసి ఇనుప రాడ్‌లతో కొట్టి కిరాతకంగా హతమార్చాడు. వివరాల్లోకి వెళితే బాలుడి తండ్రి ఇటీవల గుండెపోటుతో మరణించాడు. అది జరిగి నెల రోజులు కూడా కాకముందే తల్లి రెండో వివాహం చేసుకోవడం అతడికి నచ్చలేదు.
 
సవతి తండ్రిని మనస్పూర్తిగా అంగీకరించలేకపోయాడు. తల్లి ఎన్నిసార్లు చెప్పిచూసినా కొడుకు మాటవినలేదు. పైగా ద్వేషం పెంచుకుని మనసులో రగిలిపోయాడు. ఎలాగైనా సవతి తండ్రిని హతమార్చాలని పన్నాగం పన్నాడు. స్నేహితులతో కలిసి మాటువేసాడు, తన సోదరునితో కలిసి బైక్‌పై వస్తున్న అతడిని అడ్డుకుని, అందరూ కలిసి దాడి చేసారు.
 
ఇనుప రాడ్లతో రక్తం చిందేలా కొట్టారు. తుపాకీతో కాల్చడంతో బుల్లెట్లు దిగి అక్కడికక్కడే మరణించాడు. మృతుని సోదరుడు అక్కడ నుండి పారిపోయాడు. కొడుకు ఇంటికి వచ్చి తల్లితో విషయం చెప్పి పరారయ్యాడు. పోలీసులకు సమాచారం అందటంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు, బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను ఆపిందా? చిన్మయి ఘాటు వ్యాఖ్యలు

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments