Webdunia - Bharat's app for daily news and videos

Install App

కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ పరీక్ష కోసం వెళ్లి.. అర్ధనగ్నంగా యువతి హత్య.. కారణం..?

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (22:09 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా బీహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు వెళ్లిన యువతి నాలుగు రోజుల తర్వాత మృతదేహం లభ్యమైంది. పోలీస్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షకు హాజరయ్యేందుకు మార్చి 14న బెటా నుంచి వెళ్లిన యువతి ఆపై ఇంటికి తిరిగిరాలేదు. 
 
యువతి చివరిసారిగా ఆదివారం రాత్రి 8 గంటలకు పరీక్ష రాసి ఆటోలో ఇంటికి తిరిగివస్తూ తమతో మాట్లాడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిగంటల తర్వాత ఆమె ఫోన్‌ స్విచాఫ్‌ అయిందని, అర్ధరాత్రి దాటినా యువతి ఇంటికి చేరుకోకపోవడంతో మరుసటి రోజు ఉదయం కుటుంబసభ్యులు చితహ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో బుధవారం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 
 
యువతి మృతదేహం అర్ధనగ్నంగా పడిఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. యువతిపై ఆటో డ్రైవర్‌ లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉంటాడని అనుమానించి స్థానికులు ఆటో డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఆటో డ్రైవర్‌ నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా పాత్ర మీనాక్షికి మానస శర్మ ఒక సజీవ ఉదాహరణ: నటి రితికా సింగ్ వ్యాఖ్య

వీరాంజనేయులు విహారయాత్ర కెరియర్ కి టర్నింగ్ పాయింట్.: నరేష్

హరి హర వీరమల్లు షూటింగ్ కు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్

త్రివిక్రమ్‌ను ఇప్పటికైనా ప్రశ్నించండి ప్లీజ్.. పూనమ్ కౌర్

సత్య దేవ్, డాలీ ధనంజయ నటించిన జీబ్రా చిత్రం క్యారెక్టర్ రివీలింగ్ మోషన్-పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

తర్వాతి కథనం