Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్షుద్ర పూజలు చేస్తున్నారని ముగ్గురు మహిళలకు గుండు కొట్టించి, ఆపై?

Webdunia
గురువారం, 7 మే 2020 (19:08 IST)
క్షుద్ర పూజలు చేస్తున్నారని గ్రామస్థులు ఆగ్రహంతో ముగ్గురు మహిళలను గుండు కొట్టించి అర్థనగ్నంగా ఊరేగించారు. ఈ దారుణం మే 4వ తేదీ సోమవారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, ముజఫర్పూర్ జిల్లాలోని హతౌది పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న దక్రామా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఒక చోట పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 
 
అది తెలిసిన గ్రామస్థులు వారిపై మంత్రపూజలు చేస్తున్నారని నిందను మోపి దారుణంగా ప్రవర్తించారు. వారికి గుండు కొట్టించి అర్థనగ్నంగా ఊరేగించారు. బలవంతంగా మూత్రం కూడా త్రాగించే ప్రయత్నాలు చేసారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసుల దృష్టికి వెళ్లడంతో విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ముజఫర్పూర్ పోలీసులు తెలిపారు. 
 
మహిళలను అర్ధనగ్నంగా ఊరేగించిన దుండగులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు శ్యామ్ సహానితో పాటు మరో 9 మందిని అరెస్ట్ చేశామని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో ఆరుగురిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments