బీజేపీకి మరోషాక్ : మమత చెంతకు మరో నేత రాజీబ్ బెనర్జీ

Webdunia
ఆదివారం, 13 జూన్ 2021 (09:33 IST)
పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడుగా ఉన్న, బెంగాల్‌లో కీలక నేతగా ఉన్న ముకుల్ రాయ్ అధికార టీఎంసీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
ఆ మరుసటి రోజే పశ్చిమ బెంగాల్ మాజీ మంత్రి, బీజేపీ నేత రాజీబ్ బెనర్జీ కూడా టీఎంసీ కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్న రాజీబ్ బెనర్జీ తాజాగా టీఎంసీ నేత కునాల్ ఘోష్‌తో శనివారం భేటీ కావడం పార్టీ మారతారన్న ఊహాగానాలకు తావిచ్చింది.
 
ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో డోమ్జూర్ నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసిన రాజీబ్ బెనర్జీ ఓటమి పాలయ్యారు. టీఎంసీ అధికార ప్రతినిధి అయిన కునాల్ ఘోష్‌ను నిన్న కోల్‌కతాలో ఆయన నివాసంలోనే కలిశారు. అయితే, ఇది మర్యాదపూర్వక భేటీయేనని ఇరువురు నేతలు చెబుతున్నప్పటికీ పార్టీ మార్పు తథ్యమని తృణమూల్ వర్గాలు చెబుతున్నాయి. 
 
అయితే, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్-మే నెలల్లో పార్టీ వీడిన నేతలు, కార్యకర్తలను వెనక్కి తీసుకునేది లేదని తేల్చి చెప్పడం గమనార్హం. అయితే, ఇపుడు పార్టీ నేతలను తిరిగి చేర్చుకునే విషయంలో రెండు కేటగిరీలుగా కేటాయించి, తిరిగి పార్టీలో చేర్చుకుంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas-Anushka Wedding: ప్రభాస్ - అనుష్కల వివాహం.. ఏఐ వీడియో వైరల్.. పంతులుగా ఆర్జీవీ

Boyapati Srinu: ఇక్కడ కులాలు లేవు మతాలు లేవు. ఉన్నదంతా మంచి చెప్పడమే : బోయపాటి శ్రీను

Balakrishna:చరిత్రని సృష్టించేవాడు ఒకడే ఉంటాడు. నేనే ఈ చరిత్ర: నందమూరి బాలకృష్ణ

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments