Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో బీజేపీకి అంత సీన్ లేదు.. చెప్పిందెవరంటే..?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (13:35 IST)
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. ఇక కాషాయదళం బెంగాల్ కోటపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టింది. మమత కోటలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. 
 
తృణమూల్ కాంగ్రస్‌కు చెందిన కీలక నేతలను ఆకర్షిస్తోంది కమలం. ఇప్పటికే తృణమూల్ కు చెందిన సుబెందు అధికారి కమలం గూటికి చేరారు. ఆయనతో పాటుగా మరో పదిమంది ఎమ్మెల్యేలు కూడా కమలం పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందే తృణమూల్ నేతలు పార్టీలు మారుతుండటంతో ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. 
 
తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. నేతలు పార్టీ మారుతుండటంపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత మంది నేతలను ఆకర్షించినా వచ్చే ఏడాది బెంగాల్ లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టుమని రెండంకెల సీట్లు కూడా గెలుచుకోలేదని అన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో మమత బెనర్జీ విజయం సాధిస్తారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. 2014 నుంచి ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహారిస్తున్నారు. ఈ ఏడాది బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. కానీ, ఆర్జేడీ పరాజయం పాలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గర్ల్ ఫ్రెండ్ లో ఏం జరుగుతోంది.. అంటూ చెబుతున్న రశ్మిక మందన్న

GAMA: గామా అవార్డ్స్ లో స్పెషల్ పెర్ఫామర్ గా ఫరియా అబ్దుల్లా

Vishal: సముద్రం మాఫియా కథ తో విశాల్ 35వ చిత్రం మకుటం

balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హీరో నందమూరి బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ అభినందలు

తెలుగు చిత్రపరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ధ్యేయం : సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తర్వాతి కథనం
Show comments