Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో బీజేపీకి అంత సీన్ లేదు.. చెప్పిందెవరంటే..?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (13:35 IST)
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. వచ్చే ఏడాది జరుగనున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు చూస్తున్నాయి. ఇక కాషాయదళం బెంగాల్ కోటపై ప్రత్యేకమైన దృష్టిని పెట్టింది. మమత కోటలో పాగా వేసేందుకు వ్యూహాలు రచిస్తోంది. 
 
తృణమూల్ కాంగ్రస్‌కు చెందిన కీలక నేతలను ఆకర్షిస్తోంది కమలం. ఇప్పటికే తృణమూల్ కు చెందిన సుబెందు అధికారి కమలం గూటికి చేరారు. ఆయనతో పాటుగా మరో పదిమంది ఎమ్మెల్యేలు కూడా కమలం పార్టీలో చేరారు. ఎన్నికలకు ముందే తృణమూల్ నేతలు పార్టీలు మారుతుండటంతో ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. 
 
తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. నేతలు పార్టీ మారుతుండటంపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా, ఎంత మంది నేతలను ఆకర్షించినా వచ్చే ఏడాది బెంగాల్ లో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీకి పట్టుమని రెండంకెల సీట్లు కూడా గెలుచుకోలేదని అన్నారు. 
 
వచ్చే ఎన్నికల్లో మమత బెనర్జీ విజయం సాధిస్తారని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. 2014 నుంచి ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహారిస్తున్నారు. ఈ ఏడాది బీహార్ లో జరిగిన ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఆర్జేడీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. కానీ, ఆర్జేడీ పరాజయం పాలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments