Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన జేపీ నడ్డా

ఠాగూర్
మంగళవారం, 5 మార్చి 2024 (09:35 IST)
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా, దాన్ని రాజ్యసభ ఛైర్మన్ జగ్దీష్ ధన్కర్ ఆమోదించారు. ఈయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈయన గత 2014 నుంచి 2019 వరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పని చేశారు. 
 
2020 జనవరి 20వ తేదీన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ యేడాది ఏప్రిల్‌తో దేశంలోని 57 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది. వారిలో జేపీ నడ్డా కూడా ఒకరు. ఈ పదవీకాలం ముగియకముందే ఆయన మరోమారు రాజ్యసభకు ఎంపికయ్యారు. ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రం నుంచి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జేపీ నడ్డాతో పాటు గోవింద్ భాయ్ డోలాకియా, జస్వంత్ సింగ పర్మార్, మయాంక్ నాయక్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జేపీ నడ్డా మళ్లీ రాజ్యసభలో ఉండుగుపెట్టనున్నారు. 
 
ఈ నెల 6వ తేదీన కాళేశ్వరానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ.. 
 
ఈ నెల 6వ తేదీన కాళేశ్వరానికి ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సందర్శించనుంది. ఈ విషయాన్ని ఆదివారం తెలంగాణ నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరంపై సిఫార్సుల కోరామని తెలిపారు. నాలుగు నెలల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీకి ప్రభుత్వం గడువు ఇచ్చింది. 
 
ఎలాంటి అవగాహన లేకుండా కాళేశ్వరం బ్యారేజీలను నీటితో నింపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నిపుణుల కమిటీ సూచనలను మాత్రమే ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు.
 
'నిపుణుల కమిటీ రాకను స్వాగతిస్తున్నాం. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుంచి నీటిని ఖాళీ చేశాం. ఈ విషయంలో బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తూ తిరిగి నీటిని నింపాలని డిమాండ్ చేయడం బాధ్యతా రాహిత్యమే. మేడిగడ్డ పియర్లు కుంగిన తర్వాత అప్రమత్తమైన మా ప్రభుత్వం ఆ బ్యారేజీతో పాటు మిగిలిన రెండు బ్యారేజీలపై విచారణ నిర్వహించాలని ఎన్డీఎస్ఏకు లేఖ రాసింది. 
 
డిజైన్లు, నిర్మాణాలను అన్ని కోణాల్లో పరిశీలించామని, పగుళ్లు, కుంగుబాటుకు కారణాలు విశ్లేషించాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై సిఫార్సులు చేయాలని కోరింది. నాలుగు నెలల్లో నివేదిక అందజేయాలని కమిటీకి ప్రభుత్వం ఇటీవల గడువు విధించింది. అయినప్పటికీ వీలైనంత త్వరగా కమిటీని కోరుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. డిజైన్లు నిర్మాణం, నాణ్యత, నిర్వహణ.. అన్ని విషయాల్లో నిబంధనలను తుంగలో తొక్కింది అని మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గలేదు.. యానిమల్ నటుడితో మహానటి?

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు 3,500 అడుగులు వేయాల్సిందే..

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments