Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ డీఎన్ఏలోనే దళిత వ్యతిరేకి ముద్రవుంది : రాహుల్ గాంధీ

భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్‌ డీఎన్ఏలలోనే దళిత వ్యతిరేక ముద్ర ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దళితులను అణగదొక్కేయడమనేది ఆరెస్సెస్‌, బీజేపీ 'డీఎన్‌ఏ'లోనే

Webdunia
మంగళవారం, 3 ఏప్రియల్ 2018 (09:04 IST)
భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్‌ డీఎన్ఏలలోనే దళిత వ్యతిరేక ముద్ర ఉందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దళితులను అణగదొక్కేయడమనేది ఆరెస్సెస్‌, బీజేపీ 'డీఎన్‌ఏ'లోనే ఉంది. ఎవరైనా ఎదిరిస్తే వాళ్లని హింసించి నలిపేస్తారు. మోడీ ప్రభుత్వం నుంచి తమ హక్కులను కాపాడమంటూ మన దళిత సోదరులు, సోదరీమణులు ఈ రోజు రోడ్డెక్కారు. వారికి మేం సెల్యూట్‌ చేస్తున్నాం అని చెప్పారు. 
 
కాగా, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ దళిత సంఘాలు పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌ హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా జరిగిన అల్లర్లలో 3 రాష్ట్రాల్లో 9 మంది మరణించారు. పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు గాయపడ్డారు. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ఆరుగురు మరణించారు. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు, రాజస్థాన్‌, యూపీలోని ముజఫర్‌నగర్‌, మీరట్‌లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments