Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వస్తే పెట్రోల్ - డీజిల్ ధరలు తగ్గిస్తాం : ప్రధాని మోడీ ఎన్నికల హామీ

వరుణ్
ఆదివారం, 14 ఏప్రియల్ 2024 (12:56 IST)
గత పదేళ్లుగా ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరలను ఇష్టానుసారంగా పెంచేసిన ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ గెలిచి అధికారంలోకి వస్తే మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన బీజేపీ మేనిఫెస్టో ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హామీ ఇచ్చారు. 
 
ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేసిన తర్వాత ప్రధాని మోడీ మాట్లాడుతూ, కీలకమైన నాలుగు స్తంభాలపై బీజేపీ మేనిఫెస్టో 'సంకల్ప పత్ర'ను తయారు చేశామన్నారు. గరీబ్‌, యువశక్తి, అన్నదాత, నారీశక్తిని దృష్టిలో ఉంచుకొని దీన్ని రూపొందించారన్నారు. దేశ యువత ఆకాంక్షలను ఇది ప్రతిబింభిస్తుందన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి రోజున మేనిఫెస్టోను విడుదల చేస్తుండడం సంతోషంగా ఉందన్నారు. 
 
నవరాత్రులు కొనసాగుతున్న సమయంలో ఆవిష్కరించడం ఆశీర్వాదంగా భావిస్తున్నామన్నారు. అంబేద్కర్‌ జయంతి సందర్భంగా మోడీ, హోంమంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సహా పార్టీ ప్రముఖులంతా ఆయనకు నివాళులర్పించారు. బీజేపీ మేనిఫెస్టో కోసం యావత్తు దేశం వేచిచూసిందని మోడీ అభివర్ణించారు. పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన పురోగతే అందుకు కారణమన్నారు. 
 
భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని కమిటీ మేనిఫెస్టో కోసం చేసిన కృషిని అభినందించారు. దేశం నలుమూలల నుంచి సలహాలు, సూచనలు పంపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధి, ఉద్యోగ కల్పన, అంకురాలకు మద్దతు, వివిధ రంగాల్లో గ్లోబల్‌ సెంటర్ల ఏర్పాటుపై 'సంకల్ప పత్ర'లో దృష్టి సారించామన్నారు. గత పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశామన్నారు. వారందరూ మరింత ఉన్నతస్థితికి చేరేందుకు మద్దతు కొనసాగిస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments