Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలాంటి వారంతా ఫేక్ ముస్లింలు : మేమంతా శ్రీరాముడి వంశస్థులమే... బీజేపీ నేత జమాల్ సిద్ధిఖీ

ఠాగూర్
గురువారం, 29 మే 2025 (09:28 IST)
భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శ్రీరాముడు, శ్రీకృష్ణుడుని నమ్మని వారంతా నిజమైన ముస్లింలు కాదని నకిలీ ముస్లింలన్నారు. భారతీయ నాగరికతకు సనాతన ధర్మమే పునాది అని, ముస్లింలందరూ సనాతన గుర్తింపు పంచుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఇస్లాం ప్రవక్తల్లో రాముడు, కృష్ణుడు ఉండొచ్చని, ఆరాధనా విధానం మార్చుకున్నా... సంస్కృతి సనాతనమేనని ఆయన పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇస్లాం కంటే ఎంతో ముందు సనాతన ధర్మ ఉంది. అది మన నాగరికతకు పునాది అని ఆయన అన్నారు. ఇస్లామిక్ బోధనలు కూడా ఉమ్మడి వారసత్వ భావనకు మద్దతు ఇస్తాయని పేర్కొన్నారు. ఇస్లాంలో ఒకే ప్రవక్త కాకుండా అనేక మంది ప్రవక్తలు ఉన్నారనే నమ్మకాన్ని ఆయన గుర్తు చేశారు. 
 
ఇస్లాంలో కేవలం ఒక ప్రవక్తనేకాకుండా అనేక మందిని విశ్వసిస్తాం. ఖురాన్‌లో కేవలలం 25 మంది ప్రవక్తల పేర్లు మాత్రమే ప్రస్తావించబడ్డాయి. కానీ, హదీసులు, ఇస్లామిక్ సంప్రదాయాల ప్రకారం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 1,24,000 మంది ప్రవక్తలు పంపబడ్డారు. అలాంటపుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వారిలోలేరని మనం ఎలా చెప్పగలం? వారు కూడా మన దేవుని దూతలు అయి ఉండొచ్చు? అని సిద్ధిఖీ పేర్కొన్నారు. పైగా, "ముస్లింలందరూ శ్రీరాముడు వంశస్థులే అని అన్నారు. మనం ఆరాధనా పద్దతిని మార్చుకున్నాం... మన సంస్కృతిని కాదు... మన గుర్తింపు ఇప్పటికీ సనాతనమే" అని ఆయన వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments