Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రదాడిలో కాశ్మీర్ బీజేపీ నేత, భార్య మృతి.. ఖండించిన గవర్నర్

Webdunia
సోమవారం, 9 ఆగస్టు 2021 (19:07 IST)
ఉగ్రదాడిలో కాశ్మీర్ బీజేపీ నేత, ఆయన భార్య మృతి చెందారు. సోమవారం అనంతనాగ్‌ పట్టణంలోని లాల్ చౌక్‌ వద్ద ఓ బీజేపీ సర్పంచ్​, ఆయన భార్యపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రగాయాలైన వారిని హాస్పిటల్‌కి తరలించగా.. అక్కడ వారు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
 
మృతులు కుల్గాం జిల్లా భాజపా కిసాన్​ మోర్చా అధ్యక్షుడు గులామ్ రసూల్​ దార్​, ఆయన భార్య అని ఓ పోలీస్​ అధికారి చెప్పారు. కుల్గామ్ జిల్లా​ రేద్వానీకి చెందిన గులామ్ రసూల్​ దార్​.. ఆ గ్రామ సర్పంచ్​గా పని చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆయన అనంత్​నాగ్​లోని ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సర్పంచ్​ రసూల్ దార్​, ఆయన భార్యపై ఉగ్రవాదుల దాడి ఘటనను జమ్ముకశ్మీర్​ లెఫ్టినెంట్​ గవర్నర్​ ఖండించారు. ఈ పిరికిపంద చర్యకు పాల్పడినవారికి త్వరలోనే తగిన రీతిలో బుద్ధి చెబుతామని అన్నారు. మృతుల కుటుంబానికి లెఫ్టినెంట్​ గవర్నర్​ సంతాపం తెలిపారు
 
మరోవైపు, పూంచ్ సెక్టార్‌లో బీఎస్ఎఫ్ దళాలు నిర్వహించిన తనిఖీల్లో భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయి. ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం.. బీఎస్ఎఫ్ దళాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. విల్ సంగద్ అటవీ ప్రాంతంలో జరిగిన గాలింపులో దొరికిన ఆయుధాల్లో ఏకే 47 రైఫిళ్లు, పిస్తోళ్లు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments