Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి ఖట్టర్ స్నేహితుడి కాల్చివేత

Webdunia
శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (09:26 IST)
హర్యానా రాష్ట్రంలో దారుణం హత్య జరిగింది. సాక్షాత్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్నేహితుడిని గుర్తుతెలియని దండగులు కాల్చి చంపేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని సుఖ్‌బీర్ ఖతానా అలియాస్ సుఖిగా గుర్తించారు. 
 
రితోజ్ గ్రామానికి చెందిన సుఖి గురువారం తన స్నేహితుడితో కలిసి గురుగ్రామ సదర్ బజార్ ప్రాంతంలోని ఓ వస్త్ర దుకాణానికి వెళ్ళారు. అప్పటికే అక్కడ మాటువేసిన ఐదుగురు దుండగులు ఆయన్ను లక్ష్యంగా చేసుకుని తుటాల వర్షాలు కురిపించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సుఖిని సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారించారు. 
 
కాగా ఖతానా బావమరిది చమన్ తన స్నేహితులతో కలిసి ఈ హత్యకు పాల్పడినట్టు ఖతానా కుమారుడు అనురాగ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఆర్ఆర్ఎస్ కార్యకర్త అయిన సుఖీ తాను హత్య కావడానికి కొన్ని గంటల ముందు తన ప్రొఫైల్ పిక్‌ను మార్చడం గమనార్హం. కాగా, హత్యకు పాల్పడినవారిలో పలువురిని పోలీసులు గుర్తించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments