Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజస్థాన్‌లో బీజేపీ కేడర్ వీరంగం.. చిల్లర లేదన్నందుకు చితకబాదారు

రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు రెచ్చిపోయారు. మద్యం షాపు సిబ్బందిని రూ.2 వేల నోటుకు చిల్లర లేదన్నందుకు పట్టుకుని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోష

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (17:10 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్తలు రెచ్చిపోయారు. మద్యం షాపు సిబ్బందిని రూ.2 వేల నోటుకు చిల్లర లేదన్నందుకు పట్టుకుని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్‌లో కొందరు బీజేపీ నేత వీరేంద్ర సింగ్ రావత్ మద్యం కొనుగోలు చేయడానికి షాపుకు వచ్చాడు. అక్కడ రూ.2వేల నోటు ఇచ్చాడు. పెద్ద నోటుకు బదులు తక్కువ విలువగల నోట్లను ఇవ్వాల్సిందిగా షాపు సిబ్బంది అతన్ని కోరారు. ఈ సమయంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. 
 
కొద్దిసేపటి తర్వాత వీరేంద్రసింగ్ తన స్నేహితులతో వచ్చి షాపుపై దాడికి దిగాడు. విచక్షణారహితంగా అందులో పనిచేస్తున్న సిబ్బందిపై ఒకరి తర్వాత మరొకరు విరుచుకుపడ్డారు. గుంపుగా వచ్చిన రావత్ అనుచరులు షాపును ధ్వంసం చేశారు. 
 
తీవ్రంగా గాయపడిన సిబ్బంది స్పృహా కోల్పోవడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇదంతా అక్క‌డున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments