Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరిని వరించిన మెడిసిన్ నోబెల్ ప్రైజ్.. కేన్సర్ మహమ్మారిపై పోరాటం

వైద్య రంగానికి సంబంధించిన ఇద్దరికి నోబెల్ ప్రైజ్‌లను సోమవారం ప్రటించారు. కేన్సర్ నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ వరించింది. జేమ్స్ పీ అలిసన్, తసుకు హోంజోలకు ఈ అవ

Webdunia
సోమవారం, 1 అక్టోబరు 2018 (16:53 IST)
వైద్య రంగానికి సంబంధించిన ఇద్దరికి నోబెల్ ప్రైజ్‌లను సోమవారం ప్రటించారు. కేన్సర్ నిర్మూలన కోసం అహర్నిశలు శ్రమించిన ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ ప్రైజ్ వరించింది. జేమ్స్ పీ అలిసన్, తసుకు హోంజోలకు ఈ అవార్డులను ఎంపిక చేసినట్లు సోమవారం స్టాక్‌హోమ్‌లోని నోబెల్ కమిటీ వెల్లడించింది.
 
అత్యంత ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి చికిత్స కోసం ఇద్దరూ వినూత్న పద్ధతిని అభివృద్ధి చేశారు. ఇమ్యూన్ చెక్‌పాయిట్ థెరపీని ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు డెవలప్ చేశారు. దీంతో కేన్సర్ వ్యాధి చికిత్సలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అంతేకాదు ఈ చికిత్స విధానం వచ్చిన తర్వాత కేన్సర్‌పై ఉన్న అపోహాలు కూడా తొలిగినట్లు తెలుస్తోంది. 
 
కేన్సర్ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రతి ఏడాది కేన్సర్ వల్ల లక్షల మంది ప్రాణాలు విడుస్తున్నారు. మానవాళి మనుగడకు ఈ వ్యాధి ఓ సవాల్‌గా మారింది. అయితే ప్రాణాంతక ట్యూమర్ కణాలను చంపేందుకు ఓ కొత్త తరహా నిరోధక వ్యవస్థకు ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు ప్రాణం పోశారు. కేన్సర్ చికిత్స కోసం ఈ ఇద్దరూ ఓ కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఫలితంగా వీరికి నోబెల్ పురస్కారం వరించింది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments