Webdunia - Bharat's app for daily news and videos

Install App

లతా మంగేష్కర్ మృతి : బీజేపీ మేనిఫెస్టో విడుదల వాయిదా

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (16:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టో విడుదలను తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతితో ఆమెకు గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ ఎన్నికల మేనిఫెస్టో కోసం కేంద్ర హోం మంత్రి అమిత్, సీఎం యోగి, డిప్యూటీ గవర్నర్ కేశవ ప్రసాద్ మౌర్యతో పాటు పలువురు బీజేపీ నేతలు లక్నోకు చేరుకున్నారు. ఈ సమయంలోనే లతా మంగేష్కర్ మరణవార్త వారికి తెలిసింది. 
 
దీంతో మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని రద్దు చేసింది. ఆమెకు గౌరవ సూచకంగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత రెండు నిమిషాల పాటు అందరూ మౌనం పాటించారు. అదేసమయంలో మేనిఫెస్టో విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వారు తెలిపారు. 
 
"గాన కోకిల లతా మంగేష్కర్ మృతి చెందారు. దీంతో తాము పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాం. కొన్ని రోజుల్లోనే విడుదల తేదీని ప్రకటిస్తాం" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments