పెళ్లి రిజిస్టర్ చేసుకోని ఎన్నారైలూ... పారాహుషార్

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (12:49 IST)
సోమవారం రాజ్యసభలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఎన్ఆర్ఐల వివాహ నమోదు బిల్లు 2019 ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఎన్నారైలు భారతదేశంలోని మహిళలను లేదా ఎన్నారై మహిళలను వివాహం చేసుకున్నట్లయితే, వివాహమైన 30 రోజులలోపు రిజిస్టర్ చేసుకోవాలి. లేదంటే వారి పాస్‌పోర్ట్ రద్దు చేయబడుతుంది. 
 
అంతేకాకుండా ఇందులో దోషులుగా నిర్ధారణ అయితే, వారి ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా కోర్టుకు ఉంటుంది. ఎన్నరైల చేతుల్లో పెళ్లి పేరుతో మోసపోతున్న మహిళలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ బిల్లును ప్రవేశపెట్టినట్లు తెలుస్తోంది. భారతదేశంలో పెళ్లి చేసుకుంటే ఇక్కడి అధికారుల దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి లేదా విదేశాలలో పెళ్లి చేసుకునేట్లయితే అక్కడి అధికారులతో రిజిస్టర్ చేయించుకోవాలి.
 
లేదంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న వెబ్‌సైట్ ద్వారా న్యాయస్థానాలు సమన్లు జారీ చేస్తాయి. ఇందుకు సంబంధితంగా పాస్‌పోర్ట్ చట్టానికి, నేర శిక్షాస్పృతికి కూడా సవరణలు చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments