Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాఢనిద్రలో ఉండగా.... పట్టాలు తప్పిన సీమాంఛల్ ఎక్స్‌ప్రెస్...

Webdunia
ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (11:22 IST)
బీహార్ రాష్ట్రంలోని వైశాలి జిల్లా హాజీపూర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీ ఆనంద్ విహారి టెర్మినల్ - బీహార్‌లోని జోగ్బాని స్టేషన్ల మధ్య నడిచే సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆదివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది వరకు గాయపడ్డారు. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. 
 
ఈ రైలు ప్రమాదం జరిగిన ప్రాంతం బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రమాదంలో మొత్తం తొమ్మిది బోగీలు పల్టీ కొట్టాయి. ప్రమాదం విషయం తెలియగానే ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు, రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన స్థలానికి వైద్య బృందాన్ని పంపించినట్లు రైల్వే ఉన్నతాధికారుల తెలిపారు. బాధితుల కోసం హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. యాక్సిడెంట్ రిలీఫ్ ట్రైన్‌ను ఘటనా స్థలానికి పంపించినట్లు తెలిపారు.
 
కాగా, ఈ ప్రమాద ఘటనపై కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ స్పందించారు. సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రైలు ప్రమాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారాన్ని వ్యక్తం చేశారు. అలాగే, ప్రమాదంపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments