Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో తుపాకీతో రెచ్చిపోయిన బీజేపీ మంత్రి కుమారుడు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (11:02 IST)
బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి కుమారుడు ఒకరు తుపాకీతో రెచ్చిపోయాడు. తన ఇంటి పక్కనే ఉన్న మామిడి తోటలో అనేకమంది పిల్లలు ఆటలు ఆడుకోవడం మంత్రి తనయుడుకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో తుపాకీతో వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అలాగే, తన సిబ్బందితో కలిసి చేతికి చిక్కినవారిని గొడ్డును బాదినట్టు బాదాడు. 
 
ఈ ఘటనలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వుందని బాధిత చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన వెస్ట్ చంపారన్ జిల్లా బేతియా సమీపంలోని హర్దియా గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో బీహార్ రాష్ట్ర పర్యాటక మంత్రిగా ఉన్న నారాయణ ప్రసాద్ సాహ్ ఇల్లు ఉంది. 
 
ఈ ఇంటి పక్కనే పెద్ద మామిడి తోట ఉండగా, ఇక్కడ ఆ గ్రామానికి చెందిన పిల్లలంతా కలిసి ఆడుకుంటుంటారు. అయితే, ఈ మామిడి తోటలో ఆటలు ఆడుకోవడానికి వీల్లేదని మంత్రి కుమారుడు బబ్లూ ప్రసాద్ సాహ్ హుకుం జారీచేశాడు. ఇందుకు పిల్లలు నిరాకరించడంతో తన వద్ద ఉన్న తుపాకీతో వారిపై బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments