Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్‌లో తుపాకీతో రెచ్చిపోయిన బీజేపీ మంత్రి కుమారుడు

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (11:02 IST)
బీహార్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి కుమారుడు ఒకరు తుపాకీతో రెచ్చిపోయాడు. తన ఇంటి పక్కనే ఉన్న మామిడి తోటలో అనేకమంది పిల్లలు ఆటలు ఆడుకోవడం మంత్రి తనయుడుకి ఏమాత్రం నచ్చలేదు. దీంతో తుపాకీతో వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. అలాగే, తన సిబ్బందితో కలిసి చేతికి చిక్కినవారిని గొడ్డును బాదినట్టు బాదాడు. 
 
ఈ ఘటనలో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వుందని బాధిత చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ ఘటన వెస్ట్ చంపారన్ జిల్లా బేతియా సమీపంలోని హర్దియా గ్రామంలో జరిగింది. ఈ గ్రామంలో బీహార్ రాష్ట్ర పర్యాటక మంత్రిగా ఉన్న నారాయణ ప్రసాద్ సాహ్ ఇల్లు ఉంది. 
 
ఈ ఇంటి పక్కనే పెద్ద మామిడి తోట ఉండగా, ఇక్కడ ఆ గ్రామానికి చెందిన పిల్లలంతా కలిసి ఆడుకుంటుంటారు. అయితే, ఈ మామిడి తోటలో ఆటలు ఆడుకోవడానికి వీల్లేదని మంత్రి కుమారుడు బబ్లూ ప్రసాద్ సాహ్ హుకుం జారీచేశాడు. ఇందుకు పిల్లలు నిరాకరించడంతో తన వద్ద ఉన్న తుపాకీతో వారిపై బీభత్సం సృష్టించాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కంగ్రాట్స్ అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్యా, నువ్వు టాలీవుడ్ టాప్ హీరోయిన్ అవ్వాలి

Pawan: హరిహరవీరమల్లుకు డేట్ ఫిక్స్ చేసిన పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్. వార్ 2 గురించి హృతిక్ రోషన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

చైనా ఉత్పత్తులను కొనడం మానేద్దాం.. మన దేశాన్ని ఆదరిద్దాం : రేణూ దేశాయ్ పిలుపు

Eleven review :నవీన్ చంద్ర నటించిన ఎలెవెన్ చిత్ర సమీక్ష

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments