Webdunia - Bharat's app for daily news and videos

Install App

తల్లిపై అత్యాచారం.. అడ్డుకున్న మైనర్ బాలుడు.. కానీ కొట్టి చంపేశారు..

Webdunia
మంగళవారం, 20 నవంబరు 2018 (14:12 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నా.. కఠినమైన శిక్షలను అమలు పరచడంలో విఫలమైంది. వయోబేధం లేకుండా మహిళలపై దాడులు చోటుచేసుకుంటున్న తరుణంలో, బీహార్‌ రాష్ట్రంలో దారుణం చోటుచేసుకుంది. తల్లిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించిన కామాంధులకు చుక్కలు చూపించాడు.. ఓ మైనర్ బాలుడు. తల్లిపై జరగాల్సిన అకృత్యాన్ని అడ్డుకున్నాడు. కానీ ఆ కామాంధుల కోపానికి బలైపోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. ముజఫర్ జిల్లా ధరంపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ, తన కుమారుడితో కలిసి జీవిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన రాజేంద్ర షా అనే వ్యక్తికి చెందిన దుకాణంలో పనిచేస్తూ.. ఆమె కొడుకుని పోషించుకుంటోంది. ఆ షాపు యజమాని కొడుకు పప్పు.. దుకాణంలో పనిచేసే మహిళపై కన్నేశాడు. అతని స్నేహితులతో కలిసి దుకాణం వద్దకు వచ్చి... ఆమెపై అత్యాచారానికి యత్నించాడు.
 
అయితే ఆమె కుమారుడు అతనిని అడ్డుకున్నాడు. దీంతో కోపంతో రగిలిపోయిన పప్పు.. తన స్నేహితులతో కలిసి బాలుడిని చితకబాదాడు. తీవ్రగాయాల పాలైన బాలుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో నిందితులకు శిక్ష విధించాలని కోరుతూ.. గ్రామస్థులు బాలుడి శవంతో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments