Webdunia - Bharat's app for daily news and videos

Install App

నలుగురు కుటుంబ సభ్యులను ఉరితీసిన నక్సలైట్లు

Webdunia
ఆదివారం, 14 నవంబరు 2021 (15:59 IST)
బీహార్ రాష్ట్రంలోని గయాలోని మొన్​బార్ గ్రామంలో ఓకే కుటుంబానికి చెందిన నలుగురిని నక్సలైట్లు ఉరితీశారు. ఆ తర్వాత వారి ఇంటిని బాంబుతో పేల్చేశారు. మృతుల్లో ఇద్దరు సోదరులు, వారివారి భార్యలు ఉన్నట్టు సమాచారం. 
 
వీరందరినీ పోలీసుల ఇన్ఫార్మర్లుగా వ్యవహరించినందు వల్ల గతంలో జరిగిన ఓ ఎన్​కౌంటర్​లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని, అందుకు ప్రతీకారంగానే ఇప్పుడు ఈ చర్యకు పాల్పడినట్లు నక్సలైట్లు పోస్టర్​ అంటించారు. పైగా, ఈ గ్రామంలో ఎవరైనా తమకు నమ్మక ద్రోహం చేస్తే వారికీ ఇదే గతి పడుతుందని హెచ్చరించారు. 
 
ఈ దారుణం ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందగానే పోలీసులు, సీఆర్​పీఎఫ్ సిబ్బంది హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్​ఎస్​పీ ఆదిత్య కుమార్​, ఎస్పీ రాకేశ్​ కుమార్​ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 
 
పదుల సంఖ్యలో సిబ్బందితో గ్రామంలో పహారా కాస్తున్నారు. దాదాపు 25 మంది నక్సలైట్లు సమూహంగా వచ్చి ఈ నలుగురిని ఉరి తీసినట్లు గ్రామంలోని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అలాగే, ఆ సమీప ప్రాంతాల వాసులను కూడా అప్రమత్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments