అత్తతో అక్రమ సంబంధం.. యువకుడుని చితకబాది బలవంతపు పెళ్లి

ఠాగూర్
బుధవారం, 9 జులై 2025 (15:01 IST)
బీహార్ రాష్ట్రంలోని సుపాల్‌ జిల్లాలో ఓ దారుణం జరిగింది. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడుని పట్టుకుని చితకబాది, బలవంతపు పెళ్లి చేశారు. అడ్డొచ్చిన యువకుడి తల్లిదండ్రులపై కూడా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు పరిస్థితి విషమంగా ఉంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాష్ట్రంలోని జీవచ్ఛాపూర్‌కు చెందిన మిథిలేశ్ కుమార్ ముఖియా (24)కు తన మేనమామ శివచంద్ర ముఖియా భార్య రీటా దేవితో అక్రమ సంబంధం ఉందని బంధువులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో మిథిలేశ్‌ను కిడ్నాప్ చేసి శివచంద్ర ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ శివచంద్రతో పాటు మరికొందరు గ్రామస్థుల కలిసి మిథిలేశ్‌పై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఆ తర్వాత రీటా దేవిని కూడా అక్కడకి తీసుకొచ్చి కొట్టారు. ఆ తర్వాత మిథిలేశ్‌తో ఆమెకు బలవంతంగా తాళి కట్టించి, పాపిటలో సింధూరం పెట్టించి పెళ్లి చేశారు. అడ్డుకోబోయిన తమపైనా దాడి చేశారని మిథిలేశ్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ దాడిలో మిథిలేశ్ వీపు, మెడ, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడి ఘటనపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకోగానే గ్రామస్థులంతా పారిపోయారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు శివచంద్ర ముఖియతో పాటు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments