Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ కల్తీసారా ఘటన : 32కు చేరిన మృతులు - అంపశయ్యపై మరికొందరు..

ఠాగూర్
శుక్రవారం, 18 అక్టోబరు 2024 (09:57 IST)
బీహార్ రాష్ట్రంలో కల్తీసారా తాగి మరణించిన వారి సంఖ్య రోజురోజూ పెరుగుతుంది. శుక్రవారానికి ఈ సంఖ్య 32కు చేరుకుంది. మరికొంతమంది కల్తీసారా బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. మద్య నిషేధం అమల్లో ఉన్న రాష్ట్రంలో ఈ కల్తీసారా ఘటన కలకలం సృష్టిస్తుంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని విపక్ష పార్టీల నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. 
 
ఈ నెల 15వ తేదీన బీహార్ రాష్ట్రంలోని సివాన్, సారణ్ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించిన ఘటనలో తొలుత 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇపుడు ఈ సంఖ్య 35కు చేరుకుంది. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. సివాన్ జిల్లాలోనే మృతుల సంఖ్య అధికంగా ఉంది. ఇక్కడ 20 మందికి పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ అమితేష్ కుమార్ వెల్లడించారు. మరో 15 మంది వరకు పాట్నా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. 
 
సారణ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి పది మందికిపైగా చనిపోయినట్టు చాప్రా పట్టణం ఎస్పీ కుమార్ అషిశ్ వెల్లడించారు. సివాన్, సారణ్ జిల్లాల్లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ఎందుకంటే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న చాలా మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments