Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ప్రజలు చనిపోతున్నారు.. 24 గంటల్లో 42 మంది జలసమాధి

బీహార్ రాష్ట్రంలో వర్ష, వరద బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 42 మంది చనిపోయారు. దీంతో బీహార్‌లో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 482కు చేరింది. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా వ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (21:01 IST)
బీహార్ రాష్ట్రంలో వర్ష, వరద బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 42 మంది చనిపోయారు. దీంతో బీహార్‌లో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 482కు చేరింది. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా వరద మృతుల సంఖ్య 101కు చేరింది. 
 
కాగా, గత కొన్ని రోజులుగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ రాష్ట్రంలోని 19 జిల్లాల పరిధిలోని 1.72 కోట్ల మంది ఇంకా వరదముంపులోనే ఉన్నారు. జాతీయ విపత్తు నివారణ సంస్థకు చెందిన 28 బృందాలు, 630 మంది సైనికులు వివిధ బృందాలుగా విడిపోయి పునరావాస, సహాయక చర్యలు చేపడుతున్నా...  బాధితులను పూర్తి స్థాయిలో సురక్షిత ప్రాంతాలకు తరలించలేక పోతున్నారు. 
 
బీహార్‌లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీటిముంపులోనే ఉన్నా.. వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. యూపీలో గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 101కి చేరింది. వేలాది గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments