బీహార్ ప్రజలు చనిపోతున్నారు.. 24 గంటల్లో 42 మంది జలసమాధి

బీహార్ రాష్ట్రంలో వర్ష, వరద బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 42 మంది చనిపోయారు. దీంతో బీహార్‌లో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 482కు చేరింది. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా వ

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (21:01 IST)
బీహార్ రాష్ట్రంలో వర్ష, వరద బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారు. గత 24 గంటల్లో ఏకంగా 42 మంది చనిపోయారు. దీంతో బీహార్‌లో ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 482కు చేరింది. అలాగే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా వరద మృతుల సంఖ్య 101కు చేరింది. 
 
కాగా, గత కొన్ని రోజులుగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టిస్తున్న విషయం తెల్సిందే. ఈ రాష్ట్రంలోని 19 జిల్లాల పరిధిలోని 1.72 కోట్ల మంది ఇంకా వరదముంపులోనే ఉన్నారు. జాతీయ విపత్తు నివారణ సంస్థకు చెందిన 28 బృందాలు, 630 మంది సైనికులు వివిధ బృందాలుగా విడిపోయి పునరావాస, సహాయక చర్యలు చేపడుతున్నా...  బాధితులను పూర్తి స్థాయిలో సురక్షిత ప్రాంతాలకు తరలించలేక పోతున్నారు. 
 
బీహార్‌లోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలు నీటిముంపులోనే ఉన్నా.. వరద ప్రవాహం క్రమంగా తగ్గుముఖం పట్టింది. యూపీలో గత 24 గంటల్లో ఐదుగురు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 101కి చేరింది. వేలాది గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments