నితీశ్‌ను ఓడించిన కరోనా వైరస్ : జేడీయు అధికార ప్రతినిధి

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (10:41 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ట్రెండ్స్ మేరకు ఆర్జేడీ - కాంగ్రెస్ సారథ్యంలోని మహా కూటమి విజయం సాధించనుంది. అయితే, ఒక్కటంటే ఒక్క ఫలితాన్ని కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయు పార్టీకి చెందిన అధికార ప్రతినిధి కేసీ త్యాగి ముందుగానే ఓటమిని అంగీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రాథమిక దశ ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తున్నామన్నారు. అయితే, తాము ఆర్జేడీ చేతిలోనే లేక తేజశ్వి ప్రసాద్ యాదవ్ చేతిలోనే ఓడిపోలేదని... దేశాన్ని పట్టిపీడిస్తున్న కోవిడ్ మహమ్మారి చేతిలో ఓడిపోతున్నామని సెలవిచ్చారు. 
 
కేవలం కరోనా వల్లే తాము వెనుకబడ్డామని త్యాగి చెప్పుకొచ్చారు. గత 7 దశాబ్దాలుగా బీహార్ క్షిణిస్తూ వచ్చిందని... దాని ప్రభావం కూడా ఇప్పుడు తమపై పడిందన్నారు. మరోవైపు బీహార్‌లో నితీశ్ కుమార్ పార్టీ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఆర్జేడీ ఉండగా, రెండో స్థానంలో బీజేపీ ఉంది. అయితే ఎన్డీయే, యూపీఏ కూటమిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. 
 
తాజా ట్రెండ్స్ సరళి మేరకు.. ఎన్డీయే 119 చోట్ల, ఎంజీబీ 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఎల్జేపీ ఆరు స్థానాల్లో, ఇతరులు 11 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా'లో వేశ్య పాత్ర చేయడానికి కారణం ఇదే : నటి బిందు మాధవి

Zee 5: ది గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్ షో స్ట్రీమింగ్‌ జీ 5 లో రాబోతోంది

Raju Weds Rambai Review: నిఖార్సయిన ప్రేమకథగా రాజు వెడ్స్ రాంబాయి రివ్యూ

12A Railway Colony Review,: అల్లరి నరేష్ కు 12ఏ రైల్వే కాలనీ గట్టెక్కించేలా? 12ఏ రైల్వే కాలనీ రివ్యూ

Premante Review: గాడి తప్పిన ప్రియదర్శి, ఆనంది ల ప్రేమ.. ప్రేమంటే రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments