Webdunia - Bharat's app for daily news and videos

Install App

నితీశ్‌ను ఓడించిన కరోనా వైరస్ : జేడీయు అధికార ప్రతినిధి

Webdunia
మంగళవారం, 10 నవంబరు 2020 (10:41 IST)
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ట్రెండ్స్ మేరకు ఆర్జేడీ - కాంగ్రెస్ సారథ్యంలోని మహా కూటమి విజయం సాధించనుంది. అయితే, ఒక్కటంటే ఒక్క ఫలితాన్ని కూడా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయు పార్టీకి చెందిన అధికార ప్రతినిధి కేసీ త్యాగి ముందుగానే ఓటమిని అంగీకరిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
ప్రాథమిక దశ ఫలితాలు వెలువడుతున్న తరుణంలోనే ఓటమిని అంగీకరిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రజా తీర్పును తాము గౌరవిస్తున్నామన్నారు. అయితే, తాము ఆర్జేడీ చేతిలోనే లేక తేజశ్వి ప్రసాద్ యాదవ్ చేతిలోనే ఓడిపోలేదని... దేశాన్ని పట్టిపీడిస్తున్న కోవిడ్ మహమ్మారి చేతిలో ఓడిపోతున్నామని సెలవిచ్చారు. 
 
కేవలం కరోనా వల్లే తాము వెనుకబడ్డామని త్యాగి చెప్పుకొచ్చారు. గత 7 దశాబ్దాలుగా బీహార్ క్షిణిస్తూ వచ్చిందని... దాని ప్రభావం కూడా ఇప్పుడు తమపై పడిందన్నారు. మరోవైపు బీహార్‌లో నితీశ్ కుమార్ పార్టీ ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది. తొలి స్థానంలో ఆర్జేడీ ఉండగా, రెండో స్థానంలో బీజేపీ ఉంది. అయితే ఎన్డీయే, యూపీఏ కూటమిల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. 
 
తాజా ట్రెండ్స్ సరళి మేరకు.. ఎన్డీయే 119 చోట్ల, ఎంజీబీ 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, ఎల్జేపీ ఆరు స్థానాల్లో, ఇతరులు 11 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments