Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ సీఎం ఇంట్లో దెయ్యాలు.. వదిలివెళ్లిన మాజీ సీఎం లాలూ

Webdunia
శుక్రవారం, 3 జనవరి 2020 (13:54 IST)
బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా ఇపుడు ఓ ఆసక్తికర చర్చ సాగుతోంది. అదేంటంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నితీశ్ కుమార్ నివాసంలో దెయ్యాలు తిరుగుతున్నాయట. ఈ విషయాన్ని ముఖ్యమంత్రే స్వయంగా వెల్లడించారు. పైగా, ఈ దెయ్యాలను వదిలి వెళ్లింది కూడా ఎవరో కాదట. మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అని ఆయన సెలవిచ్చారు. ఇంతకీ నితీశ్ కమార్ అలా వ్యాఖ్యానించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. 
 
కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్ర రాజధాని పాట్నాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో నితీశ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన భవనం విశాలంగా ఉండేదని, ఇంటి వెనుక భాగంలో మట్టికుప్పలు, ఇంటి నలుమూలల్లో కాగితపు కవర్లు కనిపించాయని, తన కోసం కొన్ని దెయ్యాలను ఆ ఇంట్లో వదిలేసి వెళ్లానని లాలూ స్వయంగానే తనతో అన్నారని నితీశ్ వ్యాఖ్యానించారు. 
 
లాలూ తనదైన స్టయిల్‌లో ఈ మాటలు అనివుండవచ్చని నితీశ్ చెప్పినా, ఆయన మాటలు మాత్రం ఇప్పుడు బీహార్‌లో చర్చనీయాంశమయ్యాయి. గతంలో లాలూకు నష్టం కలిగించాలన్న ఉద్దేశంతో కాళీమాత ఆలయంలో నితీశ్ ప్రత్యేక పూజలు చేయించారని, ఈ విషయాన్ని తాంత్రికుల నుంచి తెలుసుకున్న లాలూ, పూజల ప్రభావం తనపై పడకుండా చూసుకునేందుకు ప్రత్యేక పూజలు చేశారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

సోమిరెడ్డి కోడలు శృతి రెడ్డి తో కలిసి డిజిటల్ క్లాస్ రూంను ప్రారంభించిన మంచు లక్ష్మి

Deverakonda: తిరుపతిలో దేవరకొండ కింగ్‌డమ్ గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్

Sunny: సన్నీ లియోన్ నటించిన త్రిముఖ నుంచి ఐటెం సాంగ్ గిప్పా గిప్పా షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments