Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లికూతురిని కిడ్నాప్ చేశారు.. తల నరికి మొండాన్నే మిగిల్చారు..!

Webdunia
శనివారం, 10 ఏప్రియల్ 2021 (13:57 IST)
పెళ్లికూతురిని గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కిడ్నాప్ చేశారు. ఆపై ఆమెను అత్యంత కిరాతకంగా తల నరికి మొండాన్ని మాత్రమే మిగిల్చారు. బీహార్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా ద్వారక బిగాహా గ్రామానికి చెందిన ఓ 19ఏళ్ల యువతికి నీర్‌పూర్ గ్రామానికి చెందిన ఆజాద్ కుమార్ అనే యువకుడితో పెళ్లి చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. 
 
పెద్దలు కుదిర్చిన ఈ పెళ్లికిగానూ వరుడికి దాదాపు 4 లక్షల విలువైన కట్నకానుకలు ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించారు. ఇప్పటికే కొంత మొత్తాన్ని చెల్లించారు. అయితే కొద్ది రోజుల్లో పెళ్లనగా ఆ యువతి కుటుంబంలో ఊహించని ఘోరం జరిగింది. 
 
ఉన్నట్టుండి యువతిని ఎవరో కిడ్నాప్ చేశారు. తమకు ఎవరూ శత్రువులు లేరనీ, అమ్మాయికి కూడా గతంలో ఎలాంటి బెదిరింపులు రాలేదని తల్లిదండ్రులు వాపోయారు. ఆమెకు ప్రేమ వ్యవహారాలు లాంటివి కూడా లేవని చెబుతున్నారు. 
 
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ యువతి మిస్సయిన మరుసటి రోజే ఓ గుర్తు తెలియని యువతి శవాన్ని కొందరు స్థానికులు గుర్తించారు. ఆ మృతదేహం కిడ్నాప్‌కు గురి అయిన యువతిదేనని పోలీసులు తేల్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments