Webdunia - Bharat's app for daily news and videos

Install App

తాళి కట్టే వేళ తాగితూలాడు... వధువు ఏం చేసిందో తెలుసా?

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (10:49 IST)
మరికొన్ని క్షణాల్లో పెళ్లి.. ఇంతలో వరుడు పీకల వరకు మద్యం సేవించి పెళ్లి మండపానికి వచ్చాడు. కానీ, తాళి కట్టే సమయంలో తూలాడు. అంతే.. వధువు పసిగట్టేసింది. వరుడు మద్యం సేవించివున్నాడని తెలుసుకుని, మెడలో మూడుముళ్లు వేయించుకునేందుకు ససేమిరా అంది. అంతే పీటలపై పెళ్లి ఆగిపోయింది. 
 
ఈ సంఘటన బీహార్ రాష్ట్రంలోని దుమారిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, దుమ్రి గ్రామానికి చెందిన ఓ యువతికి అదే గ్రామానికి చెందిన ఓ బబ్లూ కుమార్ అనే యువకుడుకిచ్చి పెళ్లి చేయాలని ఇరు వర్గాల పెద్దలు నిర్ణయించారు. దీంతో వీరి పెళ్లి శనివారం జరగాల్సివుంది. 
 
ఈ క్రమంలో పెళ్లి కార్యక్రమం సజావుగా సాగుతున్న వేళ పెళ్లి కుమారుడు ముహుర్తానికి ముందు మద్యం సేవించి పెళ్లి పీటలెక్కాడు. అంతే... వరుడు విపరీతంగా మద్యం సేవించడంతో తూలుతుండటాన్ని వధువు కనిపెట్టింది. అంతే.. ఈ పెళ్లి తనకొద్దంటూ మొండికేసింది. వేదిక నుంచి దిగివెళ్లిపోయింది. 
 
ఇరు కుటుంబాల పెద్దలు వధువు రింకీ కుమారికి నచ్చజెప్పినా ఆమె వివాహానికి సుముఖత చూపలేదు. రింకీ తల్లితండ్రుల నుంచి పెళ్లికుమారుడి కుటుంబం తీసుకున్న కట్నం సొమ్మును తిరిగి ఇవ్వాలంటూ గ్రామస్తులు పట్టుబట్టారు. ఈ వ్యవహారంపై వధువు తల్లిదండ్రులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: వార్ 2లో హ్యూమన్ మిషన్‌లా ఎన్టీఆర్‌ - కాస్ట్యూమ్ డిజైనర్ అనైతా ష్రాఫ్ అడజానియా

Pawan: బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్, గోపీచంద్ మలినేని- తిరుమలలో ఫ్యాన్స్ హంగామా

Nitin: హరిహరవీరమల్లు వాయిదా తో నితిన్ చిత్రం తమ్ముడు సిద్ధమైంది

Keneesha: రవి మోహన్ ప్రేయసి కెనీషా ఫ్రాన్సిస్ ప్రెగ్నెంటా?

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments