Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపాలి.. రెండు రోజులు లీవు కావాలి...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (13:15 IST)
బీహార్‌లో భార్యను చంపేందుకు రెండు రోజులు సెలవు కావాలని బ్యాంకు మేనేజర్ రాసిన ఉత్తరం సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌, బక్సర్‌కు చెందిన మున్నా ప్రసాద్ ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఇతని భార్య ఆస్పత్రితో చికిత్స పొందుతోంది. భార్యను పక్కనుండి చూసుకోలేక అప్పుడప్పుడు సెలవులు పెట్టేవాడు మున్నా ప్రసాద్. 
 
అయితే మున్నా ప్రసాద్‌కు సెలవులిచ్చేందుకు పై అధికారులు అనుమతి ఇచ్చేవారు కాదు. దీంతో మనస్తాపానికి గురైన మున్నా తన భార్యను చంపేయాలని.. ఆమె అంత్యక్రియలకు చేసేందుకు రెండు రోజులు సెలవు కావాలని పై అధికారులకు ఓ లేఖ రాశాడు. ఈ లేఖను ప్రధాని కార్యాలయం, రాష్ట్రపతి కార్యాలయాలకు కూడా పంపాడు. దీంతో జడుసుకున్న అధికారులు ఎన్ని రోజులైనా సెలవు తీసుకోవచ్చునని చెప్పేశారు. 
 
ఈ నేపథ్యంలో తన లేఖపై వివరణ ఇచ్చిన మున్నా.. తన భార్యను పక్కనుండి చూసుకోలేకపోతున్నానని.. అందుకే సెలవు కావాలని అడిగాను. సెలవులు ఇవ్వకపోవడంతో విరక్తిలో ఈ లేఖను రాయాల్సి వచ్చిందని చెప్పాడు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments