Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీహార్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి!!

ఠాగూర్
సోమవారం, 12 ఆగస్టు 2024 (10:02 IST)
బీహార్ రాష్ట్రంలోని సిద్ధేశ్వర్ ఆలయంలో తొక్కిసలాట సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయానికి మహిళా భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో భక్తులు ఒక్కసారిగా ఎగబడటంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఫలితంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారు. 
 
జెహానాబాద్ జిల్లాలోని వనహార్ హిల్స్‌లో ఉన్న బాబా సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో ఈ తెల్లవారుజామున ఒంటి గంటకు జరిగింది. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. తొక్కిసలాటపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని సదర్ ఆస్పత్రికి తరలించారు. 
 
కాగా, శ్రావణమాసం నాలుగో సోమవారం (ఉత్తరాదిలో) పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున సిద్ధేశ్వర్ స్వామి శివాలయానికి తరలివచ్చారు. ఆదివారం రాత్రి నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉండటం, సమయం గడుస్తున్న కొద్దీ మరింత భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట ఒక్కసారిగా జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments