Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇది భారతదేశ బడ్జెటా లేక బీహార్-ఆంధ్రా బడ్జెటా? పేలుతున్న మీమ్స్

Budget 2024 memes

సెల్వి

, మంగళవారం, 23 జులై 2024 (18:59 IST)
Budget 2024 memes
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్, విమర్శలకు దారితీసింది. ఈ బడ్జెట్ నిజంగా దేశం మొత్తానికి సంబంధించినదేనా.. లేక బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఎక్కువ దృష్టి పెట్టిందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
 
తన బడ్జెట్ ప్రసంగంలో, సీతారామన్ ఆంధ్రప్రదేశ్, బీహార్‌లకు ప్రధాన ఆర్థిక ప్యాకేజీలను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు, ముఖ్యమైన పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్‌తో సహా వివిధ ప్రాజెక్టులకు రూ.15,000 కోట్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్ర రాజధాని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి తోడ్పాటునందించేందుకు భవిష్యత్తులో మరిన్ని నిధులు ఇవ్వనున్నట్లు నిర్మలా సీతా తెలిపారు.
 
 హైవే నిర్మాణం, మెడికల్ కాలేజీలు, విమానాశ్రయాలు, వరద నిర్వహణ ప్రాజెక్టులలో పెట్టుబడుల కోసం రూ.26,000 కోట్లు కేటాయించడంతో బీహార్ కూడా బడ్జెట్‌లో గణనీయమైన దృష్టిని ఆకర్షించింది. 
 
ఈ ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ఆర్థిక అవకాశాలను పెంపొందించడానికి బీజేపీ తీసుకున్న ఈ చర్య, అధికార ఎన్‌డిఎ కూటమికి మిత్రపక్షాలుగా ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుండి రాజకీయ ఒత్తిడిని శాంతింపజేసే మార్గంగా పరిగణించబడుతుంది.
 
తెలంగాణలోని విపక్ష నేతలతో సహా విమర్శకులు, ఇతర రాజకీయ నాయకులు బీహార్,  ఆంధ్రప్రదేశ్‌లకు ప్రత్యేకంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు దుమ్మెత్తిపోయడం ప్రారంభించారు. దేశ విస్తృత ప్రయోజనాల కంటే సంకీర్ణ భాగస్వాముల అవసరాలకు బీజేపీ ప్రాధాన్యత ఇస్తుందని వారు మండిపడుతున్నారు. "ఇది భారతదేశ బడ్జెటా లేక బీహార్-ఆంధ్రా బడ్జెటా?" అంటూ ట్రోలింగ్ తీవ్రమైంది. ఈ ట్రోలింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతూ, మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ కవితకు నిరాశ: డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ఆగస్టు 5కి వాయిదా