ఇష్టంలేని విధులు (కరోనా) కేటాయించారనీ తుపాకీతో కాల్చుకున్న ఖాకీ

Webdunia
మంగళవారం, 14 ఏప్రియల్ 2020 (20:45 IST)
తనకు ఇష్టంలేని విధులు కేటాయించారన్న మనస్తాపంతో ఒక కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకున్నాడు. ఈ విషాదకర సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో జరిగింది. కరోనా వైరస్ దెబ్బకు దేశం యావత్తూ లాక్‌డౌన్‌లో ఉన్న విషయంతెల్సిందే. ఈ కరోనా విధుల్లో వైద్యులు, పోలీసులు, పారిశ్రామికసిబ్బంది రేయింబవుళ్లు శ్రమిస్తున్నారు. 
 
వేళకు తిండి లేకుండా, ఎక్కడ ఏది దొరికితే అది తింటూ, ఇంటిని వదిలి విధులకే అంకితమయ్యారు. ఈ పరిస్థితుల్లో మధ్యప్రదేశ్‌లోని ఓ పోలీస్ కానిస్టేబుల్ ఒత్తిడి భరించలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. భోపాల్‌లో విధులు నిర్వర్తిస్తున్న చేతన్ సింగ్ అనే 36 ఏళ్ల కానిస్టేబుల్ తన సర్వీసు తుపాకీతో కాల్చుకున్నాడు. దాంతో సహచరులు వెంటనే అతడ్ని భోపాల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించగా, ప్రమాదమేమీ లేదని వైద్యులు వెల్లడించారు. 
 
ఇకపోతే, చేతన్ సింగ్ తనకు కరోనా విధులు కేటాయించడంతో పైఅధికారుల పట్ల అసంతృప్తితో ఉన్నట్టు అతని అనుచరులు చెబుతున్నారు. విధి నిర్వహణలో తనకు కూడా కరోనా సోకుతుందేమోనని భయంతో విధులు నిర్వహిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు కూడా పెద్దగా పట్టించుకోలేదు. 
 
దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆ కానిస్టేబుల్ తొలుత గాల్లోకి కాల్పులు జరిపి ఆ తర్వాత తన ఎడమ చేతిని గురిపెట్టుకుని కాల్చుకున్నాడు. అయితే, అదృష్టవశాత్తు ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. కాగా, భోపాల్‌లో ఇప్పటికే పది మంది కానిస్టేబుల్స్ కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments