Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తు.. పెళ్లి ఊరేగింపును మరిచిపోయాడు.. తర్వాత ఏమైందంటే?

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (09:23 IST)
బీహార్‌లో మద్య నిషేధం అమలులో ఉంది. అయినా మద్యపాన సేవనం ఆగట్లేదు. ఫలితంగా మద్యం మత్తులో జీవితాలను కోల్పోతున్నారు. భాగల్‌పూర్ జిల్లాలోని సుల్తంగంజ్ మున్సిపల్ కౌన్సిల్‌లో ఇలాంటి ఉదంతం ఒకటి తెరపైకి వచ్చింది. మద్యం మత్తులో ఒక యువకుడు తన పెళ్లి ఊరేగింపుకు వెళ్లడం మర్చిపోయాడు. 
 
మరుసటి రోజు మత్తు తగ్గడంతో బంధువుల ఒత్తిడితో పెళ్లికి వెళ్లగా.. ఆపై పెళ్లికి యువతి నిరాకరించింది. అంతేకాదు పెళ్లికి చేసిన ఖర్చును వాపసు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పెళ్లికొడుకును, అతని సహోద్యోగిని కూడా బందీలుగా ఉంచారు యువతి బంధువులు. 
 
విషయం బయటకు పొక్కడంతో పోలీసులకు సమాచారం అందించారు. పెళ్లికి ముందు పెళ్లికొడుకు మద్యం సేవించాడు. అంతే స్పృహ కోల్పోయాడు.  అంతే పెళ్లి ఊరేగింపుకు రాలేకపోయాడు. పదేపదే కాల్ చేసినప్పటికీ, పెళ్లి కొడుకు వైపు నుండి ఎటువంటి స్పందన లేదు. 
 
ఊరేగింపు సోమవారమే వెళ్లాల్సి ఉండగా మంగళవారం ఉదయం వరకు కూడా చేరుకోలేదు. మరుసటి రోజు, అమ్మాయి తరపువారు సంప్రదించడంతో, బంధువుల ఒత్తిడితో, వరుడు ఎలాగోలా పెళ్లికి సిద్ధమయ్యాడు.
 
తన సహచరులతో కలిసి మంగళవారం మధ్యాహ్నం వధువు ఇంటికి చేరుకున్నాడు. కానీ ఈసారి అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో అమ్మాయి తరఫు వారు వరుడిని, అతని సహాయకుడిని బందీలుగా ఉంచి పెళ్లికి ఖర్చు చేసిన డబ్బును డిమాండ్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

హిరణ్య కశ్యప గా రానా, విజయ్ సేతుపతి ఓకే, కానీ నరసింహ పాత్ర ఎవరూ చేయలేరు : డైరెక్టర్ అశ్విన్ కుమార్

ఇంట్లో విజయ్ దేవరకొండ - కింగ్ డమ్ తో తగలబెడదానికి సిద్ధం !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments