Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారీ వర్షాలు, అకాల వడగళ్ల వానలు.. ఆరు జిల్లాల రైతులకు భారీ నష్టం

Webdunia
శుక్రవారం, 17 మార్చి 2023 (08:53 IST)
భారీ వర్షాలు, అకాల వడగళ్ల వానలతో తెలంగాణలోని ఆరు జిల్లాల రైతులు భారీగా నష్టపోయారు. ఒక్కరోజులోనే 50 మండలాల్లోని 650 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా పంట నష్టం వాటిల్లింది.
 
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని శంకర్ పల్లి మండలం ప్రొద్దుటూరులో అత్యధికంగా 4.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని మైలార్ దేవులపల్లి, శివరాంపల్లిలో కూడా భారీ వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా మోమిన్ పేట, మర్పల్లి మండలాల్లో పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
 
సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లా గోవిందరావుపేట మండలాలతో పాటు పలు జిల్లాల్లో కూడా భారీ వడగళ్ల వాన కురిసింది. వడగళ్ల వానతో పంటలన్నీ నేలకొరగడంతో పచ్చిమిర్చి బాగా దెబ్బతిన్నది. పలు జిల్లాల్లో మొక్కజొన్న, జొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
హైదరాబాద్ శివారు జిల్లాల్లో కూరగాయల రైతులు భారీగా నష్టపోయారు. టమాటా, క్యాలీఫ్లవర్, క్యాబేజీ పంటలకు భారీగా నష్టం వాటిల్లగా, బొప్పాయి, పుచ్చకాయ తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పీరియడ్స్‌ నొప్పి అని చెప్పినా నటించమని అనేవారు: నిత్యా మీనన్ షాకింగ్ కామెంట్స్

తమ 3వ ఎడిషన్‌తో తిరిగి వచ్చిన మ్యూజిక్ ఫెస్టివల్ రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్

శాసనసభ్యుడిగా నీటి సమస్యను పరిష్కరించాను : నందమూరి బాలక్రిష్ణ

అజిత్ కుమార్ యాక్ష‌న్ మూవీ పట్టుదల ఫిబ్ర‌వ‌రి రిలీజ్‌

సోను మోడల్ బ్యూటీ పార్లర్ లో ఏం చేశాడనేది లైలా టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments