Webdunia - Bharat's app for daily news and videos

Install App

భవానీపూర్ బైపోల్ : గెలుపు దిశగా మమతా బెనర్జీ

Webdunia
ఆదివారం, 3 అక్టోబరు 2021 (12:27 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గెలుపు దిశగా దూసుకెళుతున్నారు. 
 
ఆదివారం ఉదయం నుంచి పట్టిన ఓట్ల లెక్కింపులో స‌మీప ప్ర‌త్యర్థి అయిన బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంకా టిబ్రేవాల్‌పై ఏడో రౌండ్ కౌంటింగ్ ముగిసే స‌మ‌యానికి సీఎం మమతా బెనర్జీ 25 వేలకుపైగా ఓట్ల మెజార్టీలో ఉన్నారు. ఏడో రౌండ్ వ‌రకూ మ‌మ‌త‌కు 31,033 ఓట్లు, ప్రియాంకాకు 5719 ఓట్లు వ‌చ్చాయి. 
 
బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో నందిగ్రామ్ నుంచి పోటీ చేసిన మ‌మ‌తా.. బీజేపీ నేత సువేందు చేతిలో ఓడిపోయిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె ఉప ఎన్నిక‌ల్లో భ‌వానీపూర్ నుంచి పోటీ చేశారు. ఆమె విజ‌యం దాదాపు ఖాయం కావ‌డంతో మ‌మ‌తా ఇంటి ముందు టీఎంసీ కార్య‌క‌ర్త‌లు సంబరాలు చేసుకుంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

చైతూ-సమంత విడాకులపై రచ్చ రచ్చ.. డల్ అయిపోయిన శోభిత..?

సమంత, చైతూ విడాకులపై నాగ్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ ఏమయ్యారో?

అనుబంధాలకు పెద్ద పీట వేసిన చిట్టి పొట్టి చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments