Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యకు పిల్లలు పుట్టలేదని చెప్పి.. యువతిపై అత్యాచారం.. ఎక్కడ?

మిఠాయి దుకాణంలో పనిచేస్తున్న ఓ యువతిని లొంగదీసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ పెళ్లైన వ్యక్తి. ఈ ఘటన బెంగళూరు నగరంలోని నీలాసాంధ్ర ప్రాంత పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్కేగార్డె

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2017 (14:02 IST)
మిఠాయి దుకాణంలో పనిచేస్తున్న ఓ యువతిని లొంగదీసుకుని ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ పెళ్లైన వ్యక్తి. ఈ ఘటన బెంగళూరు నగరంలోని నీలాసాంధ్ర ప్రాంత పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఆర్కేగార్డెన్‌కు చెందిన రవికుమార్ (36) ఓ మిఠాయి దుకాణంలో మేనేజరుగా పనిచేస్తున్నాడు. 
 
తన భార్యకు సంతానం కలగలేదనే సెంటిమెంట్‌తో ఆమెకు విడాకులు ఇచ్చానని తనతో పాటు పనిచేస్తున్న 22 ఏళ్ల యువతితో చెప్పాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. చివరికి ఇంటికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
అయితే రవికుమార్ తన భార్యకు విడాకులు ఇవ్వలేదని తెలుసుకున్న బాధితురాలు మోసపోయిన విషయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రవికుమార్‌ను అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. బాధితురాలు 10 నెలల పాటు మిఠాయి దుకాణంలో పనిచేస్తుంది. మూడు నెలల క్రితం ఆమెను వివాహం చేసుకుంటానని బాధితురాలి తల్లిదండ్రుల వద్ద కూడా మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments