Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదేళ్ల ప్రేమ.. వేరొక వ్యక్తితో ఎంగేజ్‌మెంట్.. 16సార్లు కత్తితో పొడిచిన ప్రియుడు

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (12:52 IST)
బెంగళూరులో ఘోరం జరిగింది. కాకినాడకు చెందిన యువతి హత్యకు గురైంది. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ప్రియుడు ఆమెను 16 సార్లు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడకు చెందిన యువతి లీలా పవిత్ర (28) తనను దూరం పెట్టి వేరొక వ్యక్తితో పెళ్లికి రెడీ అయ్యిందనే కోపంతో ఆమె ప్రియుడు ఆమెను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. 
 
బెంగళూరులో ఉద్యోగం కోసం వెళ్లిన లీలా పవిత్ర ఓ ల్యాబ్‌లో పనిచేస్తుందని... అదే ల్యాబ్‌లో పనిచేసే దివాకర్ అనే వ్యక్తితో ప్రేమలో వుందని పోలీసులు తెలిపారు. ఐదేళ్ల పాటు ప్రేమలో వున్న వీరిద్దరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో గత రెండు నెలల పాటు లీలా దివాకర్‌కు దూరమైంది. 
 
ఇటీవల ఆమెకు వేరొక వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలుసుకున్న దివాకర్ ఆమెను కోపంతో హత్య చేశాడు. ఆఫీసు బయటే ఆమెను కత్తితో పొడిచి.. సహోద్యోగులు చూస్తుండగానే విచక్షణారహితంగా దాడి చేశాడని పోలీసులు తెలిపారు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నామని చెప్పారు. దివాకర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు లీలాను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments