Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రీస్‌లో ఎదురెదురుగా ఢీకొన్న రైళ్లు - 26 మంది సజీవ దహనం

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (12:23 IST)
గ్రీస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర విపత్తులో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 85 మంది గాయపడ్డారు. వీరిలో వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని గ్రీస్ అధికారులు అంటున్నారు. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో బోగీలకు నిప్పంటుకుని దగ్ధమైపోయాయి. మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఏథెన్స్ నుంచి థెసాలోన్కి వెళుతున్న ఓ ప్రయాణికుల రైలు, తెంపీ సమీపంలో ఎదురుగా వస్తున్న గూడ్సూ రైలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. 
 
ఈ ప్రమాద తీవ్రతకు ప్రయాణికుల రైలుకు చెందిన తొలి మూడు బోగీల్లో భారీగా మంటలు చెలరేగాయి. పలు బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ప్యాసింజర్ రైలులో దాదాపు 350 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 200 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ప్రమాద తీవ్రతకు ధ్వంసమైన ముందు భోగీల్లో 26 మంది సజీవదహనం కాగా, మరికొంతమందిని భద్రతా సిబ్బంది రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments