చెన్నైని ముంచేసిన వర్షాలు.. బెంగళూరులోనూ కుంభవృష్టి (video)

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (22:19 IST)
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడును వర్షాలు ముంచెత్తుతున్నాయి. వీటి ప్రభావంతో తమిళనాడుతో పాటు బెంగళూరులోనూ రాబోయే 48 గంటల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
 
అక్టోబర్ 15-17 మధ్య కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు బెంగళూరులో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి నగరంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు బెంగళూరు అర్బన్ జిల్లా కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, ఐటీఐలు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ఉండవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
పిల్లల భద్రతతో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియజేసారు. విద్యార్థులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు, వార్డెన్ సిబ్బంది, విద్యాశాఖ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments