Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైని ముంచేసిన వర్షాలు.. బెంగళూరులోనూ కుంభవృష్టి (video)

సెల్వి
మంగళవారం, 15 అక్టోబరు 2024 (22:19 IST)
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడును వర్షాలు ముంచెత్తుతున్నాయి. వీటి ప్రభావంతో తమిళనాడుతో పాటు బెంగళూరులోనూ రాబోయే 48 గంటల్లో భారీ వర్షపాతం కురిసే అవకాశం వుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
 
అక్టోబర్ 15-17 మధ్య కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు బెంగళూరులో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో రేపటి నుంచి నగరంలోని అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు బెంగళూరు అర్బన్ జిల్లా కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, ఐటీఐలు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు ఉండవని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
పిల్లల భద్రతతో పాటు వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలియజేసారు. విద్యార్థులు లోతట్టు ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు, వార్డెన్ సిబ్బంది, విద్యాశాఖ సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments