Webdunia - Bharat's app for daily news and videos

Install App

బహిరంగ ప్రదేశాల్లో విద్యార్థులకు తరగతులు ... ఎక్కడ?

Webdunia
సోమవారం, 24 జనవరి 2022 (15:44 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతోంది. కొన్ని రాష్ట్రాల్లో కోవిడ్ కేసు తగ్గుతుంటే మరికొన్ని రాష్ట్రాల్లో ఈ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి కారణంగా విద్యార్థుల భవిష్యత్ అంధకారంగా మారింది. చదువులు ఆటకెక్కాయి. పేరుకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ వాటివల్ల విద్యార్థులకు ఏమాత్రం ప్రయోజనం కనిపించడం లేదు. 
 
ముఖ్యంగా, ప్రత్యక్ష బోధనా తరగతులు గత 2020 నుంచి మాయమైపోయాయి. ఇలాంటి రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ కూడా ఒకటి. అయితే, కొన్ని రోజులుగా 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రం పాక్షికంగా క్లాసులు నిర్వహిస్తున్నారు. మళ్లీ కరోనా విజృంభించడంతో పాఠశాలలు మూసివేశారు. ఈ క్రమంలో పాఠశాలలు తెరవకపోతే విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు ఆందోళన చెందుతున్నారు. 
 
దీంతో "పరే శిక్షాయ్" పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఆరు బయట తరగతులను నిర్వహించనున్నారు. అంటే ప్రభుత్వ  పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బహిరంగ ప్రదేశాల్లో పాఠాలు బోధిస్తారు. తొలుత ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి పిల్లలకు ఈ తరహా క్లాసులు నిర్వహిస్తారు. ఇది విజయవంతమైతే మిగిలిన అన్ని తరగతులకు ఇదే విధంగా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments