Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లోకి 2010 మంది ఉగ్రవాదుల చొరబాటు... భారీ విధ్వంసానికి ప్లాన్ : బంగ్లాదేశ్ రిపోర్టు

భారత్‌లోకి రెండు వేల మంది పైచిలుకు ఉగ్రవాదులు చొరబడినట్టు పొరుగుదేశం బంగ్లాదేశ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో కేంద్ర హోంశాఖతో పాటు... నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి.

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (09:07 IST)
భారత్‌లోకి రెండు వేల మంది పైచిలుకు ఉగ్రవాదులు చొరబడినట్టు పొరుగుదేశం బంగ్లాదేశ్ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. దీంతో కేంద్ర హోంశాఖతో పాటు... నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ ఉగ్రవాదుల చొరబాటు అంశం భారత్‌లో కలకలం రేపింది. ఉగ్రవాదుల చొరబాటుకు సంబంధించిన పక్కా ఆధారాలను బంగ్లాదేశ్ సర్కారు సమర్పించడం గమనార్హం. 
 
భారత్‌లో చొరబడిన ఉగ్రవాదులంతా జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ), హర్కత్-ఉల్-జిహాదీ అల్ ఇస్లామీ (హుజీ) సంస్థలకు చెందిన సభ్యులని ఆ నివేదికలో పేర్కొంది. వీరంతా గత యేడాది తమ దేశ సరిహద్దుల మీదుగా వెస్ట్ బెంగాల్, అస్సోం, త్రిపుర తదితర ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించారని తెలిపింది. 
 
భారత్‌‌లోకి ప్రవేశించిన 2,010 మంది ఉగ్రవాదుల్లో 1,290 మంది అసోం, త్రిపుర రాష్ట్రాలకు, మిగతా వారు వెస్ట్ బెంగాల్‌కు వెళ్లినట్టు పేర్కొంది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఉగ్రవాదుల ఆచూకీ కోసం భద్రతా దళాలను రంగంలోకి దించింది. అలాగే, ఈశాన్య రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mumait Khan: ముమైత్ ఖాన్ తాజా లుక్ చూస్తే.. వాళ్లంతా పడిపోతారు.. (Photos)

క్రైమ్ వరల్డ్ నేపథ్యానికి భిన్నంగా నాని HIT: The 3rd Case

15వ దాదాఫాల్కే ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ ఫిలిం కేటగిరీలో కిరణ్ అబ్బవరం క సినిమా

హ్యాట్రిక్ హిట్ రావడం ఆనందంగా ఉంది- ఇంద్రగంటి మోహనకృష్ణ

అఖండ 2: తాండవం జార్జియా లొకేషన్స్ లో బోయపాటి శ్రీను పుట్టినరోజు వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

తర్వాతి కథనం
Show comments