Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు అమ్మ... నేడు బాబాయ్... రాజకీయ నిరుద్యోగులుగా మార్చిన జగన్ : మంత్రి కేఈ విసుర్లు

రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మహానేత దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో స్వయానా వైఎస్ సోదరుడ

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (08:57 IST)
రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మహానేత దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో స్వయానా వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇది వైఎస్ కుటుంబంలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. 
 
దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్‌ వివేకానందరెడ్డికి తన సానుభూతిని తెలుపుతున్నట్టు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, 'స్థానిక ప్రజా ప్రతినిధుల కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో ఆయనకు సీటు ఇచ్చి ఉంటే ఈ అవమానం ఉండేది కాదన్నారు. 
 
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కావాలనే వివేకాను ఈ ఎన్నికల్లో నిలబెట్టినట్లు తెలుస్తోందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ సతీమణి, జగన్ తల్లి వైఎస్.విజయమ్మను విశాఖలో పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత ఆమె రాజకీయాల నుంచి కనుమరుగయ్యారు. ఇప్పుడు బాబాయ్‌ను ఈ ఎన్నికల్లో ఓడించిన జగన్... రాజకీయ నిరుద్యోగిగా మార్చేశారు' అంటూ విమర్శించారు. 

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments