Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాడు అమ్మ... నేడు బాబాయ్... రాజకీయ నిరుద్యోగులుగా మార్చిన జగన్ : మంత్రి కేఈ విసుర్లు

రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మహానేత దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో స్వయానా వైఎస్ సోదరుడ

Webdunia
బుధవారం, 22 మార్చి 2017 (08:57 IST)
రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా మహానేత దివంగత వైఎస్ రాజేశేఖర్ రెడ్డి కుటుంబానికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో స్వయానా వైఎస్ సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇది వైఎస్ కుటుంబంలోనే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనమైంది. 
 
దీనిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయిన వైఎస్‌ వివేకానందరెడ్డికి తన సానుభూతిని తెలుపుతున్నట్టు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, 'స్థానిక ప్రజా ప్రతినిధుల కోటాలో కాకుండా ఎమ్మెల్యే కోటాలో ఆయనకు సీటు ఇచ్చి ఉంటే ఈ అవమానం ఉండేది కాదన్నారు. 
 
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి కావాలనే వివేకాను ఈ ఎన్నికల్లో నిలబెట్టినట్లు తెలుస్తోందన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ సతీమణి, జగన్ తల్లి వైఎస్.విజయమ్మను విశాఖలో పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో ఎదురైన ఓటమి తర్వాత ఆమె రాజకీయాల నుంచి కనుమరుగయ్యారు. ఇప్పుడు బాబాయ్‌ను ఈ ఎన్నికల్లో ఓడించిన జగన్... రాజకీయ నిరుద్యోగిగా మార్చేశారు' అంటూ విమర్శించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments