Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగుళూరులో దారుణం : మత్యుఘంటికలు మోగించిన గుంతలు

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (13:30 IST)
దేశ ఐటీ రాజధానిగా ఉన్న బెంగుళూరులో దారుణం జరిగింది. రహదారులపై ఉన్న గుంటలు మృత్యుఘంటికలను మోగిస్తున్నాయి. తాజాగా మంచినీటి పైపుల కోసం తవ్విన గుంటలో పడి 47 యేళ్ళ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బెంగళూరులోని పిన్యా కాలనీ, కేశరఘట్ట రోడ్డులో ఓ స్కూల్ సమీపంలో జరిగింది. 
 
పిన్యాలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో మెకానిక్‌గా పనిచేసే ఆనంద్ అనే వ్యక్తి శనివారం రాత్రి 11 గంటల సమయంలో విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో స్కూల్ సమీపంలో ఉన్న గుంతను గమనించకపోవడంతో బైక్ గుంతలోకి దూసుకుపోయింది. దీంతో ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సీసీ కెమెరాలో రికార్డు అయిన ఈ ఘటన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
 
తవ్విన గుంత వద్ద ఎలాంటి సూచికలు ఏర్పాటు చేయలేదు. కనీసం బారికేడ్లను కూడా ఏర్పాటు చేయకపోవడంతో అక్కడ గుంత ఉన్న విషయాన్ని వాహనదారులు గమనించలేకపోతున్నారు. గత ఏడాది లాక్డౌన్ సమయంలో తవ్విన గుంతలను కాంట్రాక్టర్ ఇప్పటికీ పూడ్చకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments