Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన శునకం.. ఎలా?

బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించిన శునకం.. ఎలా?
, ఆదివారం, 19 సెప్టెంబరు 2021 (09:17 IST)
వెంట్రుకలున్నమ్మ ఏ కొప్పు అయినా పెడుతున్నది ఓ సామెత. అలాగే, డబ్బులున్న ధనవంతులు కొండమీది కోతినైనా కిందికి దించుతారు. అలాంటి సంఘటనే ఇపుడు ఒకటి జరిగింది. తన పెంపుడు శునకాన్ని తన వెంట తీసుకెళ్లేందుకు ఓ కోటీశ్వరుడు ఏకంగా బిజినెస్ క్లాస్‌లోని టిక్కెట్లన్నీ బుక్ చేసుకున్నాడు  ఇందుకోసం ఏకంగా రూ.2.50 లక్షలను ఖర్చు చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన ఓ ప్రయాణికుడు చెన్నైకి తన పెంపుడు శునకంతో వచ్చేందుకు ప్లాన్ చేశాడు. అయితే, ఈ శునకం వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, పైగా, శునకానికి సౌకర్యంగా ఉండేందుకు ఎయిర్ ఇండియా విమానం ఏఐ-671  బిజినెస్ క్లాస్ కేబిన్‌లోని 12 సీట్లను రూ.2.50 లక్షలు వెచ్చించి బుక్ చేసుకున్నాడు. బుధవారం ఈ విమానంలో ముంబై నుంచి చెన్నైకి చేరుకుంది. 
 
అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో శునకాలతో గతంలోనూ పలువురు ప్రయాణించారు. అయితే, దాని కోసం బిజినెస్ క్లాస్ కేబిన్ మొత్తాన్ని బుక్ చేసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. 
 
అంతేకాదు, పెంపుడు జంతువులతో కలిసి ప్రయాణించేందుకు అనుమతించే విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రమే. ఒక విమానంలో గరిష్ఠంగా రెండు పెంపుడు జంతువులకు మాత్రమే అనుమతి ఉంది. అది కూడా చివరి వరుసలో ప్రయాణానికి మాత్రమే అనుమతి ఉంది. గతేడాది జూన్-సెప్టెంబరు మధ్య ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో 2,000 పెంపుడు జంతువులు ప్రయాణించాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో ఎంపీటీసీ - జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం