Webdunia - Bharat's app for daily news and videos

Install App

మారుతీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. 3 వేలమంది ఉద్యోగాలు ఫట్

Webdunia
శనివారం, 17 ఆగస్టు 2019 (20:15 IST)
తమ కంపెనీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది మారుతీ సుజుకీ. ఇటీవల కాలంలో కార్ల సేల్స్ తగ్గడంతో సంస్థ ఢీలా పడింది. ఈ క్రమంలోనే మారుతీ కార్ల తయారీ సంస్థలో పని చేసే 3 వేల మంది ఉద్యోగులను తొలగించింది.

ఆటోమొబైల్ రంగంలో మారుతీ కార్ల డిమాండ్ తగ్గడంతోనే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయని సంస్థ చైర్మన్ RC భార్గవ తెలిపారు. లాస్ నడిచినప్పుడు ఏ సంస్థనైనా ఉద్యోగులను తీసేయడం  బిజినెస్‌లో కామన్ అన్నారు. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు మరింతమంది కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవడం, డిమాండ్‌ పడిపోయినప్పుడు తగ్గించుకోవడం జరుగుతుందని చెప్పారు.
 
అయితే, పర్మనెంట్‌ ఉద్యోగులపై మాత్రం ప్రభావమేమీ పడలేదన్నారు. కొంతకాలంగా మారుతీ కార్ల సేల్స్ దారుణంగా పడిపోతున్నాయని.. దీంతో ఆటోమొబైల్‌ పరిశ్రమలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయన్నారు. డిమాండ్‌ లేకపోవడం, నిల్వలు పెరిగిపోవడంతో కొన్ని సంస్థలు ఉత్పత్తిని నిలిపివేశాయని చెప్పారు.
 
ప్రభుత్వం కూడా సానుకూల చర్యలేమైనా ప్రకటిస్తే.. ఆటోమొబైల్‌ రంగంలో పరిస్థితులు మెరుగుపడటానికి ఉపయోగకరంగా ఉండగలవన్నారు భార్గవ.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments